Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Roadaccident : బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి దుర్మరణం

బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి దుర్మరణం

Roadaccident: ప్రజా దీవెన పల్నాడు: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ము గ్గురు దుర్మరణం పాలయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెదనె మలిపురి వద్ద కారును లారీ ఢీకొట్ట డంతో ఈ ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద సంఘట నలో షేక్ నజీమా (50), షేక్ నూరుల్లా (26), షేక్ హబీబుల్లా (24)లు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.