Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SIMurder : ఎస్ఐను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన దుండగులు

ఎస్ఐను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన దుండగులు

 

SIMurder: ప్రజా దీవెన, చెన్నై :  చెన్నైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఎస్ఐను అతి కిరాతకంగా కొందరు దుండగులు హత్య చేశారు. వేటకొడవళ్లతో తలపై నరికి నరి కి చంపారు. ప్ర స్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నె ట్టింట వైరల్ గా మారింది. అది చూసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. నేటి సమాజం లో ఒక పోలీస్ కే రక్షణ లేకపోతే సామాన్యుల పరి స్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. జాకీర్ హుస్సేన్ (57) గతంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పని చేశాడు.

రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్ళి ఇంటికి తిరిగి పయ నమయ్యాడు. అదే సమయంలో కొందరు దుండగులు బైక్ పై వచ్చి జాకీర్ హుస్సేన్ ను వేటకొడవళ్లతో దాడిచేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు జాకీర్ ఎంత ప్రయ త్నించినా ఫలితం లేకపోయింది. అతడు కారులో ఉండగానే కత్తుల తో దాడి చేసి మెరుపువేగంతో పరారయ్యారు.