బిగ్ బ్రేకింగ్, ఏపీ ఫైర్ బ్రాండ్ వల్ల భనేని వంశీ అరెస్ట్
Ycpvallabhanenivamsi: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో గు రువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ పటమట పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ యన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం విధితమే.
ఏపీలోని గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యా లయంపై జరిగిన దాడి కేసులో వం శీని ఏ71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండ లం ఆరుగొల నులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ ఏ2గా ఉన్నా డు.ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్య క్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో కూడా నిందితుడు కావడం విశేషం.
దీంతో పోలీసులు వల్లభనేని వంశీని (vallabhanenivamsi) హైదరాబాదులో అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో సాక్షిగా ఉన్న ఆ కార్యాలయ ఉద్యోగి కోర్టులో బైండోవర్ గా మారడం తాజా గా సంచలనం సృష్టించిన విష యం తెలిసిందే. అయితే సదరు ఉ ద్యోగి తల్లి తన కుమారుడిని కి డ్నాప్ చేసి బలవంతంగా కేసు నుం చి ఉపసంహరించుకునే విధంగా భయాందోళనకు గురి చేసి ఒప్పిం చడం జరిగిందని పోలీస్ లకు ఫి ర్యాదు చేయడంతో ఆమే రకు ఏపీ పోలీసులు వెను వెంటనే వల్ల భనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు.