Diabetes Foods: మధుమేహ వ్యాధిగ్రస్తులకు (Diabetes patienst)చక్కెరకు (sugar) ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని అందరికి తెలిసిందే మనందరికీ తెలుసు. నిజానికీ చక్కెరను అధికంగా తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారికే కాదు,మనకి కూడా చాలా ఆరోగ్యకరమైనది కాదు. అలాటి వారికీ బెల్లం, తేనె (Jaggery, honey)చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు గా వాడుకోవచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దాని వినియోగం సరైనదో కాదో తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మాత్రం మంచిది. మధుమేహానికి బెల్లం, తేనె సురక్షితమైనవిగా అంటారు అంటారు. ఎందుకంటే అవి సహజ చక్కెర. బెల్లం అయినా, తేనె అయినా సహజంగా తీసుకునే ప్రతి ఆహారమూ ఆరోగ్యకరమే అని కొందరి అభిప్రాయం.
ఇక వాస్తవానికి తేనె (honey)తినడం వల్ల శరీరానికి కార్డియోమెటబోలిక్ ప్రయోజనాలను అందించవచ్చని ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధన అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే తేనె గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం వంటి జీవక్రియ రుగ్మతలను నియంత్రించడంలో కూడా బాగా సహాయపడతాయట. ఇక స్వచ్ఛమైన, పచ్చి తేనె రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. పరిశోధన సమయంలో ఐసోమాల్టులోజ్, కోజిబియోస్, ట్రెహలోస్, మెలాజిటోస్ (Isomaltulose, Kojibiose, Trehalose, Melazitose) వంటి తేనెలో లభించే అరుదైన స్వీటెనర్లు గ్లూకోజ్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తాయని పరిశోధకులు కూడా కనిపెట్టారు.
ఇక తేనె, బెల్లం నిజానికి తేనె (honey) టీగలు, ఇతర వాటి నుంచి నేరుగా ప్రాసెస్ చేస్తారు. హార్వర్డ్ నివేదిక ప్రకారం, మన శరీరంలో సహజమైన, జోడించిన చక్కెర ప్రక్రియ అదే విధంగా జరుగుతుంది. కానీ చాలా మందికి పండ్ల వంటి ఆహారాలలో ఉండే సహజ చక్కెర శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపవు. ఎందుకంటే అందులో చక్కెర పరిమాణం తక్కువగా లభిస్తుంది. అదనంగా, ఇది ఫైబర్, అనేక ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటుంది. అదే సమయంలో మన శరీరం చక్కెరను జోడించాల్సిన అవసరం లేదు. దాని నుండి ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు అని డాక్టర్లు (docterS) అంటున్నారు.
బెల్లం చక్కెర కంటే రసాయనికంగా చాలా సంక్లిష్టమైనది. సాధారణ చక్కెరకు బదులుగా దీనిని ఉపయోగించడం కొంచెం సురక్షితం. బెల్లం అనేక ఆసియా, ఆఫ్రికన్ దేశాలలో విస్తృతంగా ఉపయోగించే సాంప్రదాయ స్వీటెనర్ కూడా . ఎందుకంటే ఈ స్వీటెనర్ శుద్ధి చేయరు. చక్కెర కంటే ఎక్కువ పోషకాలు కూడా మనకి లభిస్తాయి. అలాగే బెల్లం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తుందని డాక్టర్లు అంటున్నారు.