–సెల్ఫోన్, కంప్యూటర్ అతి వాడకంతో ఇబ్బందులు
–చిన్న వయస్సులోనే దృష్టి లోపాలు
–పెరుగుతున్న దూరదృష్టి సమస్య
–కంటి వైద్యుల వద్దకు క్యూకడుతున్న యువత
Eyes Doctors : ఎక్కడైనా పది మంది ఉంటే అందులో అధిక శాతం కూర్చుని మాట్లాడటం గాకుండా సెల్ఫోన్ ను తదేకంగా చూస్తూఉంటారు. చివరకు బస్సు ప్రయాణం, వివాహాది శుభకార్యాలకు వెళ్లినా కాసేపు మాట్లాడి ఆ తర్వాత సెల్ఫోన్ లో నిమగ్నమైపోతున్నారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, భోజనం చేస్తున్నా సెల్ఫోన్ పైనే ధ్యానం. గంటల తరబడి మొబైల్ చూడటం, కంప్యూటర్ స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల కళ్ల సమస్యలతో డాక్టర్లను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. మొబైల్, కంప్యూటర్ తెరలు తదేకంగా చూడటం వల్ల నీలికాంతి (బ్లూలైట్) కళ్లను విపరీతంగా దెబ్బ తీస్తోందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 70 మందికి పైగా కంటి వైద్యులున్నారు. వీరి వద్దకు నిత్యం 10 నుంచి 20 మంది వరకు కంటి సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. వీరి అంచనా మేరకు జనాభాలో 60 శాతం ప్రజలు రోజులో 6 గంటలకు పైగా సెల్ఫోన్ చూస్తున్నారు. యువతీ యువకులు అయితే రోజులో 10 గంటలకు పైగా స్క్రీన్ నే చూస్తున్నారు. ఇలా సెల్ఫోన్ కు బానిస కావడం వల్ల ఒక్కోసారి వారికి తెలియకుండానే వారి చేతి వేళ్లు సెల్ఫోన్ పైకి వెళ్తుంటాయి. ఒకప్పుడు పగలంతా పనులు చేసుకుని సూర్యాస్తమయం ముందే తినేసి, రాత్రి చీకటి పడగానే పడుకునేవారు. సూర్యుడి కాంతి మాత్రమే మనకు కనిపించేది. ఇప్పుడు మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లోని కృత్రిమ కాంతిలో ఉండే బ్లూలైట్ వల్ల కంటికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ డిజిటల్ ఐ స్రైన్ అంటారు. ఇది ఎక్కువ కాలం కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, టీవీలు చూసినందు వల్ల వస్తుంది. కళ్లు ఒత్తిడికి గురికావడం, కళ్లు అలసిపోవడం, కళ్ల మంటలు, కళ్లు ఎరుపు కావడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, కళ్లు పొడిబారడం, నల్లగుడ్డు పొడిబారడం, మయోపియా ఎక్కువ కావడంలాంటి లక్షణాలు ఉంటాయి.
–తదేకంగా చూడటమే అసలు సమస్య…
ఒకప్పుడు పిల్లలు కాసేపు స్మార్ట్ ఫోన్ లేదా టీవీ చూస్తేనే గంటల తరబడి అలా చూస్తే కళ్లుపో తాయని దండించేవారు. కానీ ఇప్పుడు టిఫిన్, భోజనం తినిపించాలన్నా వారికి ఫోన్ చూపిస్తూ తినిపించాల్సిందే. ఈ అలవాటు రాత్రిళ్లు వారు అర్ధరాత్రి వరకు చూస్తూనే గడుపుతున్నారు. వీరితో పాటు పెద్దలూ మొబైల్ఫోన్ కు బానిసలై రాత్రింబవళ్లు చూస్తున్నారు. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంటి నుంచి నిరంతరం కంప్యూటర్ వర్క్ చేసే వారికి సైతం కంటి జబ్బులు అధికమయ్యాయి.
–కారణాలు ఇవే..
–డిజిటల్ పరికరాలు విస్తృతంగా వినియోగించడం
–రెండు గంటల కన్నా ఎక్కువగా కంప్యూటర్ తదేకంగా చూడటం
–కంప్యూటర్ లో అక్షరాలను తదేకంగా చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి.
–స్క్రీన్ క్రాంట్రెస్ట్ ఎక్కువగా ఉండటం
–సాధారణంగా నిమిషానికి 18 నుండి 20 సార్లు రెప్పవాల్చాలి. కాని కంప్యూటర్ చూసేవారికి ఇది
3 నుండి 6 సార్లు పడుతుంది.
–దీనివల్ల కళ్ళు విపరీతనం పొడిబారిపోతుంది.
—–వ్యాధి నిర్ధారణ…
–కంప్యూటర్ తో గడిపే సమయం
–కంప్యూటర్లు చూసేటప్పుడు కూర్చునే భంగిమలు
–ఇతర వైద్య కారణాలు
–మైమోనియా గ్రాండ్ పరీక్ష
…….. చికిత్స, నివారణ….
–కళ్లకు తేమను కలిగించే కృత్రిమ కన్నీళ్లు తరచుగా వాడటం
–కళ్లరెప్పలను తరచుగా మూసుకోవడం
–దృష్టిలోపాలకు వాడే అద్దాలు బ్లూఫిల్టర్ తో వాడటం
–స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం
………కంటి సమస్యలు రాకూడదంటే..
–ప్రతి అరగంటకు ఒకసారి మొబైల్, కంప్యూటర్,లాప్టాప్ నుంచి రెండు, మూడు నిమిషాలైనా దృష్టిని వేరే వైపునకు మరల్చాలి.
— కంటికి స్క్రీను 25 నుంచి 40 అంగుళాల దూరం ఉండాలి.
–యాంటిగ్లేర్, యాంటి రిఫ్లెక్టివ్ అద్దాలను వాడితే కంటికి రక్షణగా ఉంటుంది. ఇవి అధిక కాంతిని కళ్లపై పడకుండా అడ్డుకుంటాయి.
–కళ్ల మంటలు, నీరుకారడం వంటి సమస్య లుంటే కాసేపు తెరను చూడటం ఆపేయాలి.
–తరచూ చల్లని నీటితో కళ్లు కడుక్కోవాలి.రాత్రి
నిద్రించే సమయంలో కళ్లపై కాసేపు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి.
–కంటికి కసరత్తులు సైతం అవసరం. ఇందు కోసం కళ్లను కుడి, ఎడమలకు అరనిమిషం నుంచి నిమిషం పాటు తిప్పాలి. రెండు అరచేతులు రుద్దుకుని వేడెక్కిన తర్వాత కళ్లపై కాసేపు ఉంచే కసరత్తు చేయాలి.