Water board:ఏసీబీ వలలో నీటిపారుదల అధికా రి
నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాల యంలో రూ.లక్ష లంచం తీసుకుం టుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్ల ను ఎసిబి అధికారులు రెడ్హ్యాండె డ్గా పట్టుకున్నారు.
పక్కా ప్లాన్ తో 4గంటలు శ్రమించి అదుపులోకి తీసుకున్న వైనం
రూ.లక్ష లంచంతో రెడ్హ్యాండెడ్ గా పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో(Irrigation Department) నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాల యంలో రూ.లక్ష లంచం తీసుకుం టుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్ల ను ఎసిబి అధికారులు(ACB officers)రెడ్హ్యాండె డ్గా పట్టుకున్నారు. ఇదే సందర్భం లో లంచం డిమాండ్కు సంబంధిం చి కీలక అధికారి ఒకరు త్రుటిలో తప్పించుకోవడంతో అర్ధరాత్రి వర కు హైడ్రామా(Hydrama) కొనసాగింది. ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయ త్నించిన అధికారులు పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగించారు. సుమారు 4 గంటలు శ్రమించి నాలు గో వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాల యానికి తరలించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) ఎస్ఈ కార్యా లయం అధికారుల్ని ఓ దస్త్రం ఆమోదం కోసం ఓ వ్యక్తి ఆశ్రయిం చారు. ఇక్కడే ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్,(Bhansilal)ఏఈలు కార్తీక్, నిఖేశ్ ముగ్గురూ రూ.2.5 లక్షలు లంచం ఇస్తే ఆమోదిస్తామని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంగీకరించిన వ్యక్తి తొలుత రూ.1.5 లక్షలు ముట్ట జెప్పారు. ఇంకో రూ.లక్ష ఇవ్వాల్సి ఉండగా దాన్ని గురువారం సాయం త్రం ఈఈ కార్యాలయంలోనే తీసు కుంటామని అధికారులు చెప్పారు. ఈలోపు బాధితుడు ఏసీబీకి ఫిర్యా దు చేయడంతో వారు నిఘా పెట్టా రు. నీటిపారుదల శాఖ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో రూ.ల క్ష లంచం తీసుకుంటుండగా పట్టు కున్నారు. ఇదే సమయంలో లంచం తీసుకోవడంలో కీలకపాత్ర పోషిం చిన అధికారి అప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు 4 గంటల పాటు ఆయన ఆచూకీ కోసం శ్రమించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
ACB captured water board officer