Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ACB officials: విస్తుపోయే విషయాలు

–48గంటల వ్యవధిలో ఏకంగా 74 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణo
–అంటే గంటకు 1540 కిలోమీటర్ల చొప్పున వాయువేగం
–రెండు రోజుల్లోనే వేల కిలో మీట ర్లు చుట్టేసిన ఓ వాహనం
–గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం లో బయటపడిన వింత పోకడలు
–నకిలీ తప్పుడు బిల్లులతో భారీగా నగదు లూటీ
–మహబూబ్‌నగర్‌కు కేటాయించిన బిల్లులో గుర్తించిన ఏసీబీ

ACB officials:ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ లో గొర్రెల పంపిణీ పథకం (Sheep distribution scheme) కుంభ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు ముమ్మరంగా ముం దుకు సాగుతున్నారు. ఈ వింతను గుర్తించి నట్టు సమాచారం. గొర్రెల రవాణా కు సంబంధించి మహబూ బ్‌నగర్‌ జిల్లాకు కేటాయించిన బిల్లులో ఈ విడ్డూరం బయటప డగా పెద్ద మొత్తంలో నిధుల గోల్‌ మాల్‌ జరిగినట్టు తెలిసింది. గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అక్రమాల కు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు (ACB officials)దర్యాప్తు ము మ్మరం చేశారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేటాయిం చిన బిల్లులో ఓ వాహనం రెండ్రోజు ల్లో 74 వేల కిమీలు ప్రయా ణించి నట్టు పేర్కొని ఉండడాన్ని గుర్తించి నట్టు సమాచారం.

ఈ రేసుల్లో పాల్గొనే కార్లు ట్రాక్‌పై (Cars on the track) అత్య ధికంగా గంటకు 375 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్టు రికార్డులు ఉన్నా యి. ఈ కార్లను మించిన వేగంతో రాష్ట్రంలో ఓ వాహనం దూసుకెళ్లిం దనే విషయం మీకు తెలుసా ఓ వాహనం 48 గంటల వ్యవధిలో ఏకంగా 74వేల కిలోమీ టర్ల దూరం ప్రయాణించింది. అంటే గంటకు 1540 కిలోమీటర్లు చొప్పు న వాయువేగంతో దూసుకెళ్లింది. ఏంటి నిజమేనా అనుకుంటున్నా రా, 2018 ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు కేవలం రెండు రోజుల్లో ఓ వాహనం మీటర్‌ రీడింగ్‌ ఏకంగా 74 వేల కిలోమీటర్లపైగా తిరిగినట్లు పేర్కొని అందుకు తగ్గ డబ్బులు చెల్లించి, వాటిని బినామీల ఖా తాల్లోకి దారి మళ్లించినట్లు దర్యా ప్తు అధికారులు గుర్తించారు. కాం ట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా బిల్లులు, నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి ఈ అక్రమానికి పాల్పడినట్టు కని పెట్టారు.

అంతేకాదు ఒక వాహనం ఒకే రోజు శ్రీకాకుళం నుంచి మహ బూబ్‌నగర్‌, కడప నుంచి మహబూబ్‌నగర్‌ తిరిగినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు తీసుకున్న విషయం దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ గొర్రెల రవాణా విషయంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీగా (Transport Agency) వ్యవహరించిస సంస్థకు ఎండీ అయిన మొహిదొద్దీన్‌ ఈ కుం భకోణంలో కీలకంగా వ్యవహ రించాడని అధికారులు ఇప్పటికే గుర్తించారు. కేసు నమోదైనప్పటి నుంచి మొహిదొద్ద్దీన్‌ ఆయన కుమారుడు దుబాయ్‌లో తల దాచుకున్నారు. కేసుతో తమకు సంబంధం లేదని, కేవలం రవాణా వరకే చూసుకున్నామని ముందస్తు బెయిల్‌ కోరిన సమయంలో మొ హిదొద్దీన్‌ కోర్టుకు వివరించారు. అయితే గొర్రెల రవాణాలోనూ అక్రమాలు బయటపడు తుండ డంతో మొహిదొద్దీన్‌ను పట్టుకుని విచారణ చేసేందుకు ఏసీబీ సిద్ధ మవుతుంది. రూ.700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ (Transport Agency)ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి తమకు బిల్లులు చెల్లించలేదంటూ నల్ల గొండకు చెందిన సుమారు 30 మంది రైతులు ఏసీబీ అధికారుల (ACB officials)ను గురువారం ఆశ్రయించారు. అధికారులు వారి నుంచి వివరాలు సేకరించారు. ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాలకు చెందిన బాధితుల నుంచి కూడా అధికారులు వివరాలు సేకరి స్తున్నారు.