ప్రజా దీవెన హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బీసీ లకు అవకాశం కల్పించాలని కోరు తూ మంగళవారం అసెంబ్లీలో వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి నేటి వరకు మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు అవకాశం తగ్గలేదని గతంలో రెండుసార్లు జనరల్ స్థానాల్లో అగ్రకులాల వారికి రెండు సార్లు అవకాశం కల్పించారని అంతే కాకుండా ఎస్సీలకు ఒకసారి ఎస్టీలకు ఒకసారి అవకాశం కల్పించారు కనుక ఈసారి జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కల్పించి సామాజిక న్యాయం పాటించాలని సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు గోదా రవీందర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.