Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aman Preet Singh: మాదకద్రవ్యాలపై ఉక్కు పాదం

–డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు, అమన్ ప్రీతo సింగ్ అరెస్ట్
–మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న మరో ఐదుగురు పోలీసుల అదుపు లో
–నిందితుల నుంచికొకైన్, పాస్పోర్టు లు స్వాధీనం

Aman Preet Singh: ప్రజా దీవెన, హైదరాబాద్: మాదక ద్రవ్యాల కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)సోదరుడిని సైబరాబాద్, టిజి న్యాబ్ పోలీసులు (TG NAB Police) అరెస్టు చేశారు. ఆయనతో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆనోహా బ్లెసింగ్, అజీజ్, సత్యవెంకట గౌతం, మహ్మద్ మహబూ బ్ షరీప్, వరు ణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన మరో ఇద్దరు నింది తులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 199 గ్రాముల కొకైన్, రెండు పాస్పోర్టులు, రెండు బైక్లు, పది మొబైల్ ఫోన్లు స్వాధీనం (Seized mobile phones)చేసు కున్నారు. డ్రగ్స్ విలువ రూ.35 లక్షలు ఉంటుంది. గచ్చి బౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ వివరాలు వెల్లడిం చారు. నైజీరియన్ దేశానికి చెందిన మహిళ అనోహ బ్లెస్సింగ్ అలియా స్ జోనా అలియాస్ జో హేయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తోంది. వెస్ట్ ఆఫ్రికాకు చెందిన గుణి బీసా పాస్పోర్టుతో ఇండియాకు వచ్చింది.

2019 లో డ్రగ్స్ (drugs) విక్రయిస్తుండగా ధూల్పేటలో ఎక్సైజ్్స బ్బంది అరెస్టు చేశారు. నైజీరియా దేశానికి చెందిన అజీజ్ నోహీం అడేషోలా నిజాం కాలేజీలో డిగ్రీ చ దువుతు సన్సెటీలో ఉంటు న్నాడు. ఎపిలోని విశా ఖపట్టణానికి చెందిన బెంగళూరు లీడ్ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతం బెంగళూరులో ఉంటున్నాడు. 2020లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు. ఎపిలోని ఈస్ట్రగోదావరి జిల్లా, అమలాపురానికి చెందిన సా నబోయిన వరుణ్ కుమార్ కారు డ్రైవర్గా పనిచే స్తున్నాడు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, బండ్ల గూడకు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ (Mohammed Mahbub Sharif) కొరి యోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. గతంలో నేరాలు చేయడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష న్లలో కేసులు నమోదు చేశారు. నైజీరియా దేశానికి చెందిన డివైన్ ఎబూకా సుజీ అలియాస్ లెబూకా అలియాస్ ఇమాన్యూయెల్ అలియాస్ లెవల్ ఢిల్లీ లో, ఎజియో నైజిలీ ఫ్రాంక్లిన్ (Ezio Nigley Franklin)ఉచెన్న అలియాస్ కా లేశి సన్ సిటీలో ఉండూవారు. నైజీరియాకు చెంది ఇద్దరు నిందితు లు పరారీలో ఉన్నారు. ఐదుగురు డ్రగ్స్ విక్రయించే నిందితులు హైద రాకోట్లోని జానాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ (Fort View Apartment)లో సమావేశం అ వుతు న్నారనే సమాచారం రావ డంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీ య డగ్స్ నెట్వర్క్ నడిపిస్తున్న ప్రధాన నిందితుడు డివైన్ అబూకా సూజీ ఇండియా నుంచి నైజీరియా కు వెళ్లి అక్కడి నుంచి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నా డు. నైజీరియాకు చెందిన అనోహ బ్లెస్సింగ్ ను నకి లీ పాస్పోర్టుతో ఇండియాకు పలుమార్లు పంపిం చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అనోహ బెంగళూరు ఉంటూ దేశవ్యాప్తంగా విమానం, రైలులో తిరు గుతూ డీలర్లకు కొకైన్ను సరఫరా చేస్తోంది.