Anasuya Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళా సంఘాలను ఆర్దికంగా (Women’s groups are organized) బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందు కు వేసింది. మహిళా స్వయం సహా యక సంఘాలకు బ్యాంకు రుణా లు ఇప్పించి వారి ద్వారా బస్సుల ను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా కార్యా చరణను సిద్దం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచా లని డిమాండ్ వస్తున్న నేపథ్యం లో మహిళా సంఘాలకు ఉపాధి కల్పిస్తూ వారి ద్వారా కొనుగోలు చేసిన బస్సులను హైర్ చేసుకోవాలని ఆర్డీసీ నిర్ణయించింది. ప్రయోగా త్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను (RTC Hire Buses) కేటాయించాలని నిర్ణయించింది. మంగళవారం సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Anasuya Sitakka)ఆద్వర్యంలో రవాణా శాఖ, పీఆర్ ఆర్డీ ఉన్నాధికారుల సమావేశం జరిగింది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపు విధి విధానాలపై చర్చలు జరిపారు.
రవాణా శాఖ స్పెషల్ సెక్రటరి (Special Secretary, Department of Transport) వికాస్ రాజ్, కమీషనర్ ఇలంబర్తీ, పీఆర్ ఆర్ డీ సెక్రటరి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టీజీ ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. మొదటి విడతలో ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని నిర్ణయించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీం నగర్ లను ఎంపిక చేసారు. మొదటి విడతలో 100 నుంచి 150 బస్సులను మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలు (Women’s Associations) కొనుగోలు చేసే ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాద్యతల కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చు తదితర అంశాలన్నింటితో కూడిన సమగ్ర నివేదికను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.