–అక్రమ నిర్మాణదారులే కూల్చివేత ఖర్చులు భరించాలి
–బుల్డోజర్లు,ఆపరేటర్ వేతనం,కూ ల్చివేత వ్యర్థాల తరలింపు వంటివి
–హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
AV Ranganath: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గత కొన్ని రోజులుగా చెరువులను ఆక్ర మించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తూ ప్రజల అభిమానం చూరగొ న్న హైడ్రా (hydra) తాజా గా అక్రమ నిర్మాణ దారులకు మరో షాక్ ఇచ్చింది. కూ ల్చివేతలకు అయ్యే ఖర్చు మొత్తం వారే భరించాల్సి ఉంటుందని స్ప ష్టం చేసింది. కూల్చివేతలకు సంబం ధించి బుల్డోజర్లు, వాటికి ఇంధనం, ఆపరేటర్ కు వేతనం, కూల్చివేతల తర్వాత పోగవుతున్న వ్యర్థాల తర లింపు వీటికయ్యే ఖర్చు మొత్తం అక్రమ నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్(AV Ranganath తేల్చిచెప్పారు. ఇందు కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణ దారుల దగ్గరే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామ న్నారు. హైడ్రా ఇప్పటి వరకు సిటీలో ని 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మా ణాలను కూల్చివేసింది. ఇందులో పలు భారీ కట్టడాలు కూడా ఉండ డంతో నిర్మాణ వ్యర్థాలు పెద్ద ఎత్తు న పోగయ్యాయి.
ఆక్రమణలు తొలగించడంతో (Removal of encroachments) పాటు చెరువులను పూ ర్వ స్థితిలోకి తీసుకురావడానికి తవ్వకాలు జరపాల్సి ఉంటుందని, భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జర గకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వే యాల్సి ఉంటుందని హైడ్రా కమిష నర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. వ్యర్థా ల తరలింపుతో పాటు ఈ ఏర్పాట్ల కు రూ.కోట్లలో ఖర్చవుతుందని ఆయన వివరించారు. అయితే, హైడ్రా (hydra) వద్ద ప్రస్తుతం నిధులు ఆ స్థాయిలో లేవని ఆయన వివ రించారు. ఇప్పటి వరకు జరిపించిన కూల్చివేతలకు ఇచ్చిన కాంట్రాక్టు లోనే శిథిలాల తొలగింపును కూడా చేర్చామని తెలిపారు.