Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AV Ranganath: చెరువుల‌ చెరవిడిపించడo లక్ష్యం

–ఇదే ప్రభుత్వ హైడ్రా ప్ర‌ధాన ఉద్దే శం
–చెరువులను ఆక్ర‌మిస్తే చూస్తే ఉరుకోబోo
–ఎంతటివారైనా సిరీయ‌స్ యాక్ష‌న్ ఉంటుంది
–ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్‌లలో ఇంటి స్థ‌లాలు కొనొద్దు
–చెరువుల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్యం
–మీడియాతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌

AV Ranganath:ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో (FTL, buffer zone) ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ (AV Ranganath)సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌లో సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కుపైగా ఉన్నాయని చెప్పారు. నగరంలోని చెరువులను హైడ్రా ప్రధానంగా తీసుకుంటుందన్నారు. ఎన్‌ఆర్‌ఎ స్సీ నివేదిక ప్రకారం 44 ఏండ్లలో చాలా చెరువులు కనుమరుగ య్యాయని వెల్లడించారు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని 80 శాతం ఆక్రమణలకు గురయ్యా యని చెప్పారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తిస్తున్నాం, చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామ‌ని హై డ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (AV Ranganath)చెప్పారు.

చెరువుల ఆక్రమణలను (Invasion of ponds)అడ్డుకోక పోతే హైదరాబాద్‌ భవిష్యత్‌ ప్రశ్నా ర్ధకమవుతుందన్ని తెలిపారు. త్వర లో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని, ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ కూడా ఉం టుందన్నారు. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి (Hydra range) ఉందని తెలిపారు. ప్రజల నుంచి తమకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. దురాక్ర‌మ‌ణ‌ల‌పై ద‌శ‌ల‌వారీగా చ‌ర్య‌ లు, దశలవారీగా హైడ్రా పనిచేస్తుం దన్నారు. మొదటి దశలో ఆక్రమణ లను అడ్డుకోవడం హైడ్రా చేసే అని వివరించారు. రెండో దశలో ఆక్రమిం చి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుం దన్నారు.మూడో దశలో చెరువుల పూడిక తీసి వాననీటిని మళ్లించి పునర్జీవనం కల్పిస్తామన్నారు. గొలుసుకట్టు చెరువులన్నింటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని తెలిపారు. అవకాశవాదం వల్ల గొలుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని వెల్లడించారు. చెరువుల పరిరక్షణకు (Conservation of ponds) అందరితో కలిసి మేథోమదనం చేస్తామన్నారు.

పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామన్నారు. పార్కు స్థలాల్లో ఫెన్సింగ్‌ (Conservation of ponds) వేసేందుకు కాలనీ సంఘాలకు సహకరిస్తున్నామని తెలిపారు. బస్తీ వాసులు మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలన్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేయొద్దు..నందగిరి హిల్స్‌ సొసైటీతో తమకు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చందానగర్‌లో గతేడాది బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని తెలిపారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని వెల్లడించారు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు.