Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: ముచ్చర్ల ‘ వెనుక భూదందా ముఠా

–వేల ఎకరాలను సేకరించి దోచుకు నే కుట్ర
–ధరణిపై భూముల అన్యాక్రాంతం పై శ్వేత పత్రం విడుద చేయండి
–ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని నిలదీత
— బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
–బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది
–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్
–గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరు ‘Fourth City’)తో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తు న భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధి లో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టే ట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తుల ను పోగేసుకునేందుకు సిద్ధమ య్యారని అన్నారు.ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందన్నరు. దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందన్నారు. ఆదివారం మహే శ్వరం నియోజకవర్గంలోని గుర్రం గూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్ కుమార్ చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి (Gangidi Manohar Reddy), జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఆయన మాటల్లోనే..తెలంగాణ అక్కాచెల్లెళ్లు, అన్నద మ్ములకు (For sisters and brothers) మా ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధు లివ్వదు. హిందువుల పం డుగలకు పైసలివ్వ రు.సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)కోట్లు ఖర్చు చేస్తోంది. రంజాన్ కు రూ.33 కోట్లు, హిందు వులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యం గా చెప్పుకోవడం సిగ్గు చేటు. హిందువుల పండుగలంటే అంత చులకనా? బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోంది. ఈ విషయంపై మాట్లాడితే నాపై మతతత్వ ముద్ర వేయాలని చూస్తున్నరు. ఇట్లనే వ్యవహరిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టడం ఖాయం. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునగడం ఖాయం. 15 నిమిషాలపాటు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ ఒవైసీని తీసుకెళ్లి కొడంగల్ లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ (Congress party)వాస్తవాలు ఆలోచించాలి. నిరంతరం బీజేపీని విమర్శించడం మానుకోవాలి. కేంద్రంతో సమన్వయంతో వ్యవహరించాలి. తెలంగాణ అభివ్రుద్దికి మేం పూర్తిగా సహకరిస్తాం. కలిసికట్టుగా పనిచేసి నిధులు తీసుకొద్దాం. అంతే తప్ప ప్రధానమంత్రిని అదే పనిగా తిట్టడంవల్ల నష్టమే తప్ప లాభం లేదనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.

మహేశ్వరం ను ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నరు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ (Maheshwaram Congress)స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారు.

రుణమాఫీ ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ (Loan waiver)చేశారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల సంఖ్య గత ప్రభుత్వ హయాంలోనే 36 లక్షల మంది ఉంటే లక్షన్నర లోపు రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 18 లక్షలు దాటకపోవడం విడ్డూరం. అంటే నూటికి 70 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలే ఒకవైపు బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి, బయట చేసిన అప్పులు తీరక, పెట్టుబడికి పైసల్లేక రైతులు అల్లాడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతోంది. రుణమాఫీతోపాటు 6 గ్యారంటీలను అమలు చేయకుండా దాటవేసేందుకు కాంగ్రెస్ నేతలకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల ద్రుష్టిని మళ్లించడం అలవాటైపోయింది. రాబోయే స్థానిక సంస్థల్లో గెలిచేందుకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. రుణమాఫీ సహా 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులుసహా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని బీజేపీ (bjp) పోరుబాటకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కార్యచరణ రడీ అవుతోంది.

ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం….భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగింది. తెలంగాణ ఏర్ప‌డిన 2014 నాటికి రాష్ట్రంలో 24 ల‌క్ష‌ల అసైన్డు భూములుంటే నేడు ఆ భూములు ఐదు ల‌క్ష‌ల‌కు ఎలా త‌గ్గాయి. అసైన్డు భూముల‌ను, శిఖం భూములను, దేవాదయ, అటవీ, భూదాన భూములతోపాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడ‌ర్లు దండుకున్నరు. రిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వివ‌రాలేవి? వాటిని ఎందుక‌ని రేవంత్ స‌ర్కారు బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఆ భూముల విలువ రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయల వ‌ర‌కు ఉంటుంద‌. కేసిఆర్ కుటుంబ సభ్యులు పెద్ధ ఎత్తున ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు స‌భ్యుల‌తో వేసిన క‌మిటీ నివేదిక ఏది? ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవ‌రో ఎందుకు తేల్చడం లేదు? ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా దోచుకోవాలా? అనే అంశంపై రహస్య నివేదిక ఇచ్చినట్లుంది. అందుకే ఫోర్త్ సిటీ, భూమాత పేరుతో భూములను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్తులో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డు.. వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకే విలీన కుట్ర (Merger Conspiracy)చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారులోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివ్రుద్ధికి నోచుకోలేదు. వాటిని అభివ్రుద్ది చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్ధం లేనిది. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణను ప్రకటిస్తుంది.