Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BC Commission: కీలక అప్డేట్….తెలంగాణలో కుల గణన విధివిధానాల పై కసరత్తు షురూ

BC Commission: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. కులగణన పై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (BC Welfare Minister Ponnam Prab hakar)నేతృ త్వంలో సెక్రటేరియట్ లోని వారి ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి,బీసీ కమిషన్ సభ్యులు , సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం బీసీల్లో రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి బీసీ కమిషన్ (BC Commission) ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే కుల గణన కోసం అసెంబ్లీ లో ,క్యాబినెట్ లో కూడా తీర్మానం చేసింది. అయితే కుల గణన ఎలా చేయాలి అనే దానిపై అధికా రులతో చర్చించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కుల గణన పై అధ్యయనం చేశారు. కర్ణాటక , బీహార్, ఆంధ్రప్రదేశ్ లో చేసిన కుల గణన పై సమావేశంలో చర్చించా రు. కర్ణాటక లో బీసీ కమిషన్ చేసిన సర్వే , బీహార్ లో జీఏడి ద్వారా చేసిన సర్వే , ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ ద్వారా సర్వే చేసిన అంశాల పై చర్చించారు. అక్కడ డోర్ టూ డోర్ పూర్తి స్థాయ సర్వే నిర్వహించారు.

ఇందులో మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీ నీ తీసుకొని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.మరోవైపు ఎస్సి వర్గీకరణ కు సుప్రింకోర్టు సాను కూలంగా తీర్పు ఇవ్వడం ప్రభు త్వం వర్గీకరణ మీద సబ్ కమిటీ సమావేశాలు కొనసాగుతుండటం తో కుల గణన సర్వే నివేదిక ఎస్సి వర్గీకరణ కు కూడా అవసరం ఉం టుంది కాబట్టి పూర్తి స్థాయి కులాల గణన చేసి వారికి అవస రమైన డేటా తీసుకునేలా చేసే అంశం పై చర్చించారు.

రిపోర్ట్ (report)పారదర్శకంగా ఉండడానికి ఇరు శాఖలకు సం బంధం లేకుండా కుల గణన జీఏడీ లేదా పంచాయతీ రాజ్ , రెవె న్యూ లో దేని ద్వారా చెపించాలనే దానిపై రెండు రోజుల్లో సీనియర్ మంత్రులతో ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేయ నుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కుల గణన కు (caste enu meration) సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృ త్వంలో మాని టరిం గ్ చేసేలా చూడాలని సూచించారు. కుల గణన ప్రారంభమై నెల రోజు ల్లో పూర్తి చేయాలని సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరం జన్ ,కమిషన్ సభ్యు లు , బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, పంచా యతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ , కమిషనర్ అనితా రామచం ద్రన్ ,బీసీ కమిష నర్ బాల మాయాదేవి , లా సెక్రటరీ రాజశేఖర్ ఇతర ముఖ్య అధికా రులు.