— మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నాంపల్లి బీజేపి రాష్ట్ర కార్యా లయంలో శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud)జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజ రైన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. ఈ యుద్ధాలు వద్దురా కొడుకా మన ది గీత వృత్తి అది చేసే బతకాలని తల్లి అన్నప్పుడు, తాటి చెట్టు ఎక్కి తే ఏమొస్తదమ్మా, ముంత కల్లు తప్ప, కొడితే గోల్కొండను కొట్టాలి రాజై పాలించాలి” అని అన్నాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud) అని గుర్తు చేశారు. 1650 ఆగస్టు18న ప్రస్తుత స్టేషన్ఘన్పూర్నియోజ కవర్గం ఖిలాషాపూర్లో జన్మించిన పాపన్న గౌడ్ అసాధారణంగా ఎదిగి చరిత్ర సృష్టించాడన్నారు. తల్లి సర్వ మ్మ, తండ్రి ధర్మన్న గౌడ్.
ఊరికి పెద్ద అయిన ధర్మన్న గౌడ్ ధర్మం వైపు నిల బడ్డందుకు స్థానిక దొరల చేతి లో హతమయ్యాడు. పాపన్నకు చిన్న ప్పటి నుంచే పోరాట స్ఫూర్తి ఎక్కువ. ఆయన కల్లు మండవలో ఉన్నప్పుడు అప్పటి మొఘల్ సైనికు లు (Mughal soldiers) అపహాస్యం, అవహేళన చేసేవారు. ఓ సైనికుడు తన మిత్రుbడిని ఒకసారి అకారణంగా కాలి తో తన్నబోయినప్పుడు ఆవే శం ఆపుకోలేక పాపన్న గీత కత్తితో ఆ సైనికుడి మెడ కోశాడు. అక్కడ మొదలైన తన గెరిల్లా యుద్ధం గో ల్కొండ కోటకు చక్రవర్తి అయ్యే వరకు సాగింది. తన స్నేహితులు చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరు మాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీర్ సాహెబ్ ఇలా12 మంది స్నేహి తులతో పాపన్న (papanna మొదలు పెట్టిన గెరిల్లా సైన్యం అటు స్థానిక దొరల, జమీందార్ల, ఇటు మొఘల్ సైనికు లపై దాడులు చేశాడు. గడీల దొర ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేవా డు.
పాపన్న (papanna పేరు, ప్రఖ్యాతులు ఊరూరా పాకి, యువత పెద్ద ఎత్తున పాపన్న (papanna) సైన్యంలో చేరింది. 12 మందితో మొదలైన గెరిల్లా సైన్యం12,000కు పెరిగింది. మొదట సర్వాయిపేట కోటను ఆక్రమించి, క్రమంగా.. తాటికొండ, కొలనుపాక, చేర్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, బోనగిరి, వరంగల్, కోట సహా1678-–80 వరకు దాదా పు 20 కోటలను కైవసం చేసుకు న్నాడు. చివరకు గోల్కొండను కూడా ఆక్రమించి 7 నెలలు పాలిం చి చరిత్రలో నిలిచాడు. తన పోరా ట జీవితంలో సాగిన కొన్ని ముఖ్య ఘట నలు చూస్తే పాపన్న యుద్ధ, దౌత్య నీతి, సమయస్ఫూర్తి అర్థమ వుతాయి. సర్వాయి పాపన్నగౌడ్ పోరాటానికి సంబంధించి ఎన్నో సజీవ సాక్ష్యాలు నేటికీ ఉన్నాయి. ఆయన స్వయంగా నిర్మించిన ఖిలా షాపుర్, తాటికొండ కోట, వేము లకొండ కోటలు, స్థాపించిన హు స్నాబాద్ పట్టణం, ఎల్లమ్మ గుడి, నిర్మించిన చెక్ డ్యాంలు నేటికీ ఉన్నాయి. గోల్కొండ కోటలో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి సాక కూడా అప్పటిదే. అక్కడ మొదటి బోనం గౌడ సామాజిక వర్గం పాపన్నకు (papanna నివా ళులుగా సమర్పిస్తారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న జానపద కథలు, గేయాలు అనేకం ఉన్నాయి. 18 74లో జేఏ బోయల్ అనే ఇంగ్లీష్ చరిత్రకారుడు రికార్డు (record) చేసిన7 పాయల రాజు అనే బుర్ర కథలు, దూళ్మిట్ట వీరగల్లు శాసనంలో “బం డిపోత గౌడ షాపూర్ ఖిలా పులి గౌడ, యాబది రోద్దీ, షబ్బారాయద, ఫోదౌర్ పాపన్న గౌడ” అని ఉన్న వాక్యం ఓ సజీవ సాక్ష్యం. కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాపన్నపై అధ్యయ నం చేయించి ఆయన ముఖ చిత్రం తో పుస్తకాన్ని(ది న్యూ కేంబ్రిడ్జి హిస్ట రీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ డెక్కన్) ముద్రించింది. విక్టోరి యా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్వాయి పాపన్న శిలా విగ్రహం ఉం ది. చరిత్రకారులు బార్బారా, రాబర్ట్ మేట్ క్లిప్ పాపన్నను “రాబిన్ హుడ్ ఆఫ్ డెక్కన్” గా అభివర్ణిస్తే, రిచర్డ్ ఈటోన్ “సామాజిక బందిపోటు” అని పేర్కొన్నారు. పాపన్న చరిత్రను నేటి తరానికి అందించిన పేర్వారం జగన్నాథం, మాజీ డీజేపీ (djp)పేర్వారం రాములుకు ఈతరం రుణపడి ఉంట ది. మరియు పాపన్న గౌడ్ ఆశయాలను సాధించాలి అని తెలియజేశారు.