Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CAG Report : ఎక్సైజ్ శాఖను ఎండగట్టిన ‘ కాగ్’

–ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విష యంలో రూ.77 కోట్ల అక్రమాలు
–అవకతవకలన్నీ 2017-22 మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తింపు
–179 కేసులకు సంబంధించి పన్ను లు తక్కువ, ఆలస్యంగా చెల్లించిన వైనం
–ఆరు ఎక్సైజ్ సూపరింటెంట్ కా ర్యాలయాల్లో అపరాధ రుసుంలో అధికారులు నిర్లక్ష్యం
–తాజాగా కాగ్ నివేదికలో స్పష్ట మైన అక్రమాలు వెల్లడి

CAG Report: ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంలో (Telangana Govt) గడిచిన నాలు గైదు ఏళ్లుగా జరిగిన అక్రమాలను కాగ్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. తాజాగా తెలంగాణ ఎక్సై జ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయం లో రూ.77 కోట్ల అక్రమాలు జరిగి నట్లు కాగ్ తన నివేదికలో స్పష్టంగా వెల్లడిం చింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీ ల్లో గుర్తించామని తెలిపింది. ఈ సం దర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది.దాదాపు 179కేసులకు సంబంధించి పన్నులు తక్కువ చెల్లించడం, ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం వసూలు చేయకపోవడం చేశారని వెల్లడించింది. అలాగే అసలు పన్నులే చెల్లించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని చెప్పింది.

రాష్ట్రానికి నివేదిక ఇచ్చిన అనం తరం ఎక్సైజ్ శాఖ (Excise Department)11కేసుల్లో రూ. 11లక్షలు వసూలు చేసినట్లు కాగ్ తెలిపింది. 2018 డిసెంబరు నుంచి 2022 మార్చి మధ్య 6 ఎక్సైజ్‌ సూ పరింటెండెంట్‌ కార్యాలయాల పరి ధిలో అపరాధ రుసుం చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కాగ్ తెలిపింది. 46 బార్‌ అండ్‌ రెస్టా రెంట్లు తమ లైసెన్సుల పునరు ద్ధర ణ రుసుం, వార్షిక బార్‌ ఎక్సైజ్‌ (Bar Excise) పన్ను చెల్లింపుల విషయంలో ఆల స్యం చేసినట్లు తెలిపింది. అయితే వారికి రూ.71లక్షల అపరాధ రు సుం విధించకుండా అధికారులు వదిలేసినట్లు నిగ్గు తేల్చింది. ఈ అంశాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందని లేదని చెప్పింది.సికింద్రాబాద్‌ డీపీఈవో కార్యాలయ రికార్డులను 2022 ఫిబ్రవరిలో ఆడిట్‌ చేస్తున్న సమ యంలో రెండు బార్లు రూ.24లక్షలు చెల్లించని విషయం తమ దృష్టికి వచ్చినట్లు కాగ్ వెల్లడించింది. 20 20-21కి సంబంధించి రెండు బార్లు వార్షిక ఎక్సైజ్‌ పన్ను చెల్లించలేదని, వసూలు చేసేందుకు చర్యలు తీసు కుంటామని డీపీఈవో చెప్పారని తెలిపింది.

దీనిపై 2022నవంబర్‌లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పం దించలేదని చెప్పింది. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబం ధించి మేడ్చల్‌ ఆర్‌కే డిస్టిలరీస్‌ ఎక్సైజ్‌ (RK Distilleries Excise)పన్ను చెల్లింపులో ఆలస్యం చేసినా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని వెల్లడించింది. ఆల స్యం చేసినందుకు విధించాల్సిన రూ.86.99 లక్షల అపరాధ రుసుం ను సైతం ఎక్సైజ్‌శాఖ విధించలేదని తెలిపింది. ఈ విషయం 2022జన వరిలో రికార్డులు పరిశీలించిన సమ యంలో గుర్తించినట్లు కాగ్ పేర్కొం ది.శంషాబాద్‌ డీపీఈవో పరిధిలో 12మంది బార్ లైసెన్సుదారులపైనా అధికారులు సరైన చర్యలు తీసుకో లేదని కాగ్ తన నివేదికలో తెలిపిం ది. 2019 జనవరి నుంచి 2020 నవంబర్ వరకూ పన్ను చెల్లింపు విషయంలో వారు ఆలస్యం చేసినా విధించాల్సిన రూ.10.44 లక్షల అపరాధ రుసుం విధించలేదని వెల్లడించింది. 2022మార్చిలో ఖమ్మం, మహబూబాబాద్‌ డీపీ ఈవోల పరిధిలో ఎలైట్‌ బార్లకు సంబంధించి ఆడిట్‌ చేశామని, అయితే మూడు బార్లు రూ.12ల క్షల ఎక్సైజ్‌ ట్యాక్స్, అదనపు ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (Excise Tax, Additional Excise Tax)తక్కువగా చెల్లిం చినట్లు గుర్తించామని కాగ్ తన నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.