–భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమా వేశానికి స్వచ్ఛందంగా రైతులు హా జరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) కోరారు. శుక్రవారం ఆయనొక పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా ఈ మేరకు పిలుపునిచ్చా రు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు(farmers), ముఖ్యంగా మూసి పరివాహక ప్రాం త రైతన్నలకు సవినయ విజ్ఞప్తి. గత ప్రభుత్వాలు విస్మరించినటు వంటి మూసీ ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమాని కి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలంటే రైతుల సహ కారం అవసరం, మీ అందరూ నడుంబిగించి కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని రైతన్నలను కోరారు.
శనివారం హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ (Shubham Gardens) లో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతుల సమావేశానికి ప్రతి ఒక్క రైతు హాజరై సమావేశాన్ని విజ యవంతం చేయాలని కోరారు. ఈ మూసి జీవనది కింద తరత రాలుగా మనము వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తు న్నాము. పూర్వం ఎంతో ఘన చరిత్ర కలిగిన మూసీ నది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించు కున్న ఈ నది నీరు సాగు, తాగు, పాడి,మత్స్య అవసరాలకు ఉప యోగపడేది. హైదరాబాద్, రంగారె డ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం కలిగేది.అంత గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది (Musi River)నేడు మానవ తప్పిదాల వలన కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతుంది.కలుషితమై పంటలు సరిగా పడడం లేదు, కొనే పరిస్థితి లేదని,పండిన పంటలను తినే పరిస్థితి లేదన్నారు.
Bhuvanagiri mp chamala Kiran Kumar reddy appeal pic.twitter.com/CPDpe5E8xB
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) October 4, 2024
ఈరోజు ప్రభుత్వం ఎస్టిపిలతో మురికి నీరు ను శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి, రైతులకు (farmers) మంచినీరు అం దించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు.మూసీ నదిని శుద్ధిచేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష నాయకులు రైతు లను ప్రజలను తప్పుతో పట్టించి మూసి ప్రక్షాళన అడ్డుకునే ప్రయ త్నాలు చేస్తున్నారు ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలని కోరారు.ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ (Fluoride)గుర్తుకొచ్చేది, ప్లోరోసిస్ వ్యా ధితో బాధపడుతున్న జనాలు కళ్ళముందు కనపడేది, అట్లాంటి ఫ్లోరైడ్ సమస్యని నివారించుకోగ లిగినాము.నేడు మానవ తప్పిదాల వల్ల కాలుష్యం అయిన మూసీ నది ని శుద్ధి చేసుకోలేమా,రేపు జరిగే సమావేశానికి హాజరై ప్రభుత్వానికి మద్దతు పలకాలని రైతులను కో రారు.