–వైద్యం చేయకుండానే సీఎంఆర్ ఎఫ్ సొమ్ము దోపిడీ
–30 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు, సీఐడీ విచారణ వేగవంతం
–అనుమానం రాకుండా బిల్లులు, ఒక్కోటిగా బయటపడుతున్న బాగో తాలు
–నిధులు జమయిన ఖాతాలపై, స హకరించిన అధికారులపైనా ఆరా
CID officials: ప్రజా దీవెన, హైదరాబాద్: అనారో గ్యంతో ఆపదలో ఉన్నప్పుడు ఆస రాగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధిని సైతం అక్రమార్కులు చెరబ ట్టారు. వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆ ర్ఎఫ్ సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆస్ప త్రులపై సీఐడీ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలి సిం ది. హైదరాబాద్తో పాటు ఉమ్మడి వరంగల్, నల్లగొండ, కరీంనగర్, రం గారెడ్డి జిల్లాల్లోని ఆయా ఆస్పత్రు లు (hospitalas) అక్రమంగా సీఎంఆర్ఎఫ్ పొంది నట్లు గుర్తించిన అధికారులు రెండు, మూడు రోజులుగా కేసులు నమో దు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉ మ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలు గు ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు న మోదు చేసినట్లు సమాచారం.
ఈ మేరకు అధికారుల దర్యాప్తులో ప లు ఆసక్తికర విషయాలు వెలుగులో కి వచ్చాయి. వాస్తవానికి సీఎం ఆర్ఎఫ్ స్వాహా చేశారన్న ఆరో పణలపై గత ఏడాది ఏప్రిల్లో సెం ట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) పోలీ సులు విచారణ చేపట్టారు. అప్ప ట్లోనే కొన్ని ఆస్పత్రుల నిర్వాహ కులను అదుపులోకి తీసుకున్నా రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు సైతం సంబంధిత ఫైల్ను పక్కనపెట్టారు. సీఎం రేవంత్రెడ్డి వచ్చాక అప్పటి అక్రమాల లెక్క తేల్చాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకునేర పరిశోధన శాఖ (సీఐడీ) (cid) రంగ ప్రవేశం చేసి క్షుణ్ణంగా విచార ణ చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా ఆస్పత్రుల బయట బోర్డు లపై ఉండే వైద్యుల పేర్లను వాడు కొని నిందితులు ఈ గోల్మాల్కు తెర లేపినట్లు తెలిసింది. ఏ మాత్రం అనుమానం రాకుం డా నకిలీ బిల్లు లు సృష్టించి, లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు అధికారులు గు ర్తించారు. సీఎంఆర్ఎఫ్కు దర ఖాస్తు చేసుకున్న పత్రాల్లో పేర్కొన్న ఆస్పత్రి పేరు, చిరునామా తమదే అయినప్పటికీ అందులో చికిత్స అందించిన పేర్కొన్న వైద్యుడు ఎవ రో తమకు తెలియదని, ఆ పేరుతో తమ ఆస్పత్రిలో ఎవరూ పని చేయ ట్లేదని దర్యాప్తు అధికారులకు ఆస్ప త్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రి రికార్డుల్లోని ఇన్పేషెంట్ నంబర్లతో సంబంధం లేని వ్యక్తులు సీఎంఆర్ ఎఫ్కు (To CMR F)దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే సమయంలో చిన్న చిన్న క్లినిక్ ల్లోనూ శస్త్రచికిత్సలు చేసినట్లు బిల్లులు సృష్టించి, నిధులు డ్రా చేసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఒకటి, రెండు మూత పడిన ఆస్ప త్రుల పేరుతోనూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు వచ్చినట్లు తేలింది.
తమ ప్రమేయం లేకుండానే కేస్ షీట్లు, మెడికల్ బిల్లులు ఎలా వచ్చాయో తెలియడం లేదని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం కళ్లుగప్పి సిబ్బంది ఎవరైనా బిల్లులు సృష్టించారా ఎవరి ప్రాత ఎంత అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న తర్వాత నిధులు జమ అయిన బ్యాంకు ఖాతాలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. రోగి ఆస్పత్రిలో చేరిన తేదీ, ఆపరేషన్ లేదా చికిత్స చేసిన తేదీ, డిశ్చార్జి అయిన తేదీ, సీఎంఆర్ఎఫ్కు (Date of enlistment, date of discharge, CMRF)దరఖాస్తు చేసుకున్న తేదీ, నిధులు మంజూరైన తేదీ ఇలా ప్రతి అంశం పైనా ఆరా తీస్తున్నారు. ప్రాథమికం గా పరిశీలించిన కొన్నింటిలో వైద్యం చేయించుకున్న తేదీకి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న తేదీకి మ ధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండగా నిధుల విడుదల మాత్రం తక్కువ సమయంలో జరిగినట్లు సీఐడీ ద ర్యాప్తులోబహిర్గతమైంది.
శస్త్ర చికి త్సల వివరాల నుంచి నకిలీ బిల్లుల తయారీ దాకా, దరఖాస్తు నుంచి ఆర్థిక సహాయం పొందే దాకా ప్రతి దశలో ఎక్కడిక్కడ ఈ ముఠాకు ప్ర భుత్వ ఉద్యోగులు ఎవరైనా సహ కరించారా అనే కోణంలో అధికారు లు ఆరా తీస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఐడీ అధి కారులు విచారణ చేపట్టగా చాలా బిల్లులు నకిలీవని తేలినట్లు సమా చారం. కొన్ని కేసుల్లో వైద్యం కూడా పొందలేదని, వారి పేరిట వచ్చిన సీఎంఆర్ఎఫ్ బిల్లులో లబ్ధిదా రులకు కొంత డబ్బులు అందజేసిన మధ్యవర్తులు మిగతా సొమ్ము కాజేసినట్లు తెలిసింది. మిర్యాలగూ డలో మహేశ్ మల్టీ స్పెషాలిటీ ఆస్ప త్రి పేరును నాలుగేళ్ల వ్యవధిలో మూడు సార్లు మార్చడంపైనా అను మానాలు వ్యక్తమవుతున్నాయి. గ తంలో వేరే పేరిట ఉన్న ఈ ఆస్ప త్రికి సీఎంఆర్ఎఫ్ కింద నిధులు ఏ మైనా అందాయా అన్న కోణం లో నూ విచారణ సాగుతోంది.