–ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో వైద్యం
–కోలుకుంటోన్న ములుగు విద్యార్థిని కార్తీక
CM Revanth Reddy: ప్రజా దీవెన,హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థి ని కొ య్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి (CM Revanth Reddy)అండగానిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాల య అధికా రులను ఆదేశించారు. సీఎం (cm) సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ (Hyderabad Nims)లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యా ర్థిని కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందప డిపోయింది. దీంతో నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు విద్యార్థి నిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి, అక్కడి నుంచి హైదరా బాద్ నిమ్స్ కు తరలించారు.
నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ (Dr. Thirumal)గారి బృందం మంగళవారం నాడు కార్తీ కకు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలి పారు. కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారితో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Sitakka)గారు కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నా రు.