CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా హైద రాబాద్ మహానగర మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలమం డలి అధికారులను ఆదేశించా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు తొలి సమావే శం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. తాగునీటితో పాటు భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సివరేజీ ప్రణాళికను రూపొందించడంలో ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయిం చాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగ రంలో జనాభాకు సరిపడే విధంగా తాగునీటి సరఫరా చేస్తున్నామని, నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9.800 కిలోమీటర్ల మేర డిస్ట్రి బ్యూషన్ నెట్వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లతో నీటి సరఫరా చేస్తు న్నట్టు సమావేశంలో అధికారులు వివ రించారు. నగరానికి మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతుండగా, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తరలించి ఉస్మాన్సాగర్ , హిమాయత్సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సంబంధించి కన్సల్టె న్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నీటి లభ్యత, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టి లో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టు ను చేపట్టాలని నిర్ణయిం చారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవ సరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తరలించేలా మార్పులకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ జలమం డలి ఆదాయ వ్యయాల నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా వివరించగా,జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అం దుకు అనుసరించాల్సిన విధానా లను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జల మండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూ ర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నా యాలను ఎంచుకోవాలని ముఖ్య మంత్రి సూచించారు.
అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్ లు తయా రు చేయించాలని చెప్పారు. నగరం లో పలు ప్రాంతాలకు మంజీరా ద్వారా 1965 నుంచి నీటిని సర ఫరా చేస్తున్న పైపులైన్లకు కాలం చెల్లిన నేపథ్యంలో ప్రత్యామ్నా యంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.