CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పోలవ రం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభా వాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెంది న బృందంతో అధ్యయనం చేయిం చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికా రిని నియమించి నెల రోజుల్లో సమ గ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలని చెప్పారు. ముఖ్య మంత్రి అధ్యక్షతన నీటి పారుదల శాఖపై సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్లతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పోలవ రం నిర్మాణంతో భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవాల యానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు.2022లో 27 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి నప్పుడు భద్రాచలం ముంపునకు గురై నట్లు అధికారులు వివరించా రు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజ నాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRM B)తో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రి త్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వరద జలాల ఆధారంగా బనకచర్ల నిర్మి స్తున్న ట్టుగా ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందనీ, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతు లు లేవని అధికారులు వివరించిన ప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేయా లని ముఖ్యమంత్రి ఆదేశించారు.