CM Revanth Reddy: మూసీకి రెండు పక్కలా కిలోమీటర్ వరకు పక్కా..సియోల్ పర్యటన లో వెల్లడించిన ఎంపీ, మంత్రులు
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఇంతకు ముందు ఇక్కడికి టూర్కు వచ్చినప్పుడు ఈ విష యాన్ని తెలుసుకొని ఇప్పుడు మ మ్మల్ని పంపించిండు. దక్షిణ కొరియా సియోల్లో చుంగ్ గై చున్ వాగు పక్కన నిలబడి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్రెడ్డి వెల్లడించిన వివరాలు సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రులు పొంగులేటి శ్రీని వాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ సైతం ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.మూసీ ఇరువైపులా చుంగ్ గై చున్ వాగు పరిసరాల లెక్క మా రుస్తారని సదరు మంత్రులు, ఎంపీ అధికారికంగానే చెప్పారు..మూసీ వెంట ఇంత పెద్ద ఆకాశహర్మ్యాలు రావాలంటే బఫర్జోన్ దాటి కిలో మీటర్ మేర విస్తరణ చేస్తారని మరో సారి చెప్పకనే చెప్పారు.
ఇప్పటివరకు రేవంత్ సర్కారు (Revanth Govt) బయటికి బఫర్జోన్ వరకు ఉన్న 10 వేల నిర్మాణాలనే కూల్చుతా మని చెప్తున్నా ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్లో నదికి రెండు వైపులా కిలోమీటర్ మేర అభివృద్ధి చేస్తామని పొందుపర్చారు. తాజా గా సియోల్ పర్యటనలో మంత్రు లు సైతం ఇదే విషయాన్ని ధ్రువీ కరించారు.ఈ లెక్కన మూసీ రివర్ బెడ్, బఫర్జోన్లోని నిర్మాణాలను తొలగించి అందులోకి గోదావరి జ లాలను ప్రవహింపజేస్తారు.రాష్ట్ర ప్రభుత్వమే మూసీ వెంట ఎలివే టెడ్ కారిడార్లు, రహదారులు, బ్రిడ్జిలు, మెట్రో రైలు నిర్మిస్తుంది. నదికి రెండువైపులా కిలోమీటర్ వరకు 110 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్న ర్షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తుంది.
పీపీపీ విధానంలో ప్రైవేట్ కంపెనీలకు (Private companies) ఎం త లాభం ఉంటుంది, ప్రభుత్వానికి ఎం త ఆదాయం ఇస్తారు ఇలా ప్ర తి దశలో విధి విధానాల ఖరారు బాధ్యత మెయిన్హార్ట్ కన్సార్టియం (Meinhardt Consortium) చూస్తుందని ఇప్పటికే సీఎం రేవం త్రెడ్డి ప్రకటించారు.మూసీకి రెండు వైపులా ప్రైవేట్ కంపెనీలు స్థలాల ను 30-50 ఏండ్లకు లీజుకు తీసు కొని రెస్టారెంట్లు, వాణిజ్య సము దాయాలు, వినోద కేంద్రాలు నిర్మి స్తాయి.ఆదాయంలో ఒప్పందం మేరకు ప్రభుత్వానికి ఏటా కొంత చెల్లిస్తారు.