Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

–పది రోజుల కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా
–అధికారుల సమీక్షలో సీఎం రేవం త్ రెడ్డి

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర మంతటా సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజా పాలన కార్య క్రమం నిర్వహించాలని ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)నిర్ణయించా రు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేం దుకు ఈసారి ప్రజాపాలన కార్యక్ర మం చేపడుతామని చెప్పారు. ఇక పై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివ రాలను సేకరిస్తామన్నారు. రాష్ట్ర మంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వ హించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేసుకోవాలని ముఖ్య మంత్రి అధికారులను (Chief Minister Officers) ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిCM Revanth Reddy), మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వైద్యా రోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ (Dana Kishore), సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే వైద్య పరీక్షలు చేయాలి గ్రా మాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా రాష్ట్రంలో ఉన్న లాబోరేటరీల సాయం తీసుకోవాలా వెంటనే పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదే శించారు. హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీ వల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ (For services to Rajiv Arogya Sri Vaidya, CMRF) ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుం దని సీఎం అన్నారు.

ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్… సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ము ఖ్యమంత్రి (cm) అధికారులను ఆదే శించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుప త్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆం దోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్య లు చేపట్టాలని సూచించారు. గ్రేట ర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహె చ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధి కారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం (cm)ఆదేశించారు.

పని చేయని ఉద్యోగులను, ప్రజల ఆరోగ్య (Health of employees and people) పరిరక్షణకు చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలని సీఎం హెచ్చ రించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమ న్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడి యా సహకారంతో సీజనల్ వ్యా ధులపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని ముఖ్యమంత్రి సూచిం చారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజ నల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశిం చారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, పలు గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కార ణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టా లని ఆదేశించారు.