CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ యువతను ప్రపంచం లోనే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వా నికి మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి మధ్య అవగా హన ఒప్పందం కుదిరింది. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బా రావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మెఘా కంపెనీ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. అంతకుముం దు ముఖ్యమంత్రి మెఘా ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపారు.స్కిల్స్ వర్సిటీలో అధు నాతన మౌలిక సదుపాయాలతో కూడిన యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ. 200 కోట్లు కేటాయించింది.
ఈ క్యాంపస్లో అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్స్ (Hostel Buildings) నిర్మిస్తామని పీవీ కృష్ణా రెడ్డి తెలిపారు.సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందు కు వచ్చినందుకు ముఖ్యమంత్రి మెఘా కంపెనీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అంది స్తామని చెప్పారు.హైదరాబాద్ శివారు కందుకూరు మండలంలో మీర్ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో (57 acres area)ప్రపంచ శ్రేణి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ ర్సిటీ నిర్మాణానికి గత ఆగస్టులోనే ముఖ్యమంత్రిభూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్కి టెక్ట్ నిపుణులతో (Architect professionals) తయారు చేయిం చిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను నేటి సమా వేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్య మంత్రి సూచించారు.డిజైన్లకు తుది రూపం ఇచ్చి నవంబర్ 8 వ తేదీన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.