–టీచర్ల చేతుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భవిష్యత్తు ఉంటుంది
–ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం గౌర వంగా భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి
–పదిహేనేళ్ల పెండింగ్లో పదోన్నతి అంశాన్ని పరిష్కరించాం, తెలంగా ణ బలపడేందుకు కృషి చేయాలి
–ఎల్ బి స్టేడియం లో ఉపాధ్యా యులతో ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయు ల (The future teachers of Telangana state) చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యా యులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. తెలంగా ణ భవిష్యత్తు ఎక్కడ ఉందని ఈ క్షణం తనను అడిగితే వేలాది మం ది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ఉందని చెబుతానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మం ది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం, ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లి దండ్రులు వారి భవిష్యత్తును ఉపా ధ్యాయుల చేతుల్లో పెట్టారని తెలి పారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందను కున్నాం, ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం, ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య (Kodandaram, Haragopal, Chukka Ramaiah) లాంటి వారికి గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం, కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఏం జరిగిందో చూశామని పేర్కొ న్నారు. గత పాలకులు ఉపాధ్యా యులను ఏ విధంగా అవమానించా రో చూశామని తెలంగాణ భవిష్య త్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమా వేశా న్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవం త్ అన్నారు.
ఉపాధ్యాయులంతా 90శాతం పైగా నిబద్ధతతో పనిచే యాలని కోరారు. ప్రభుత్వ పాఠ శాలల్లో చేరడం ఆత్మగౌరవమని భావించే విధంగా స్కూళ్లను తీర్చి దిద్దాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేం దుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించిన ట్టు చెప్పారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువు కుంటుంటే 10 వేల ప్రైవేట్ పాఠశా లల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠ శాలల్లో (In private schools) మీకంటే గొప్ప టీచర్లు న్నారా మీకంటే చదువు తక్కువ ఉన్నవారు ప్రైవేట్ టీచర్లుగా ఉన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇం దుకు కారణం కావచ్చు. ఆడపిల్లలు చదువుకునేందుకు పాఠశాలల్లో కనీస వసతులు లేవు. తెలంగాణ లో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది’’ అని సీఎం అన్నారు. టీచర్లు తేనె తుట్టె లాంటివారని, హాని చేయాల ని చూస్తే తేనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతినెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్య లు తీసుకున్నామని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించామని చెప్పా రు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు తో మహిళలకు బాధ్యత అప్పగిం చామని, ప్రభుత్వ పాఠశాలకు ఉచి త విద్యుత్ అందించాలని అధికారు లను ఆదేశించామని గుర్తు చేశా రు.
టీచర్లు ప్రభుత్వానికి (Teachers are the government)సహక రించాలి …తెలంగాణ బలపడా లంటే అందరం కార్యదీక్షతో పనిచే యాలని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రా ష్ట్రంలో మరోసారి ప్రజా ప్రభుత్వం రావాలంటే పేదలకు చదువు చెప్పా లని, అందుకు టీచర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ‘మాకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు’ అని సీఎం వ్యాఖ్యానించారు. చాలా కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గంజాయి వంటి వ్యసనాలకు అల వాటు పడుతున్నారని, అందుకే రాష్ట్రంలో డ్రగ్స్పై ఉక్కువాదం మోపామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) చక్కదిద్దుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల దశాబ్ద కాలం నాటి కల ప్రమోషన్లు, బది లీల విషయంలో ప్రత్యేక చొరవ చూపించి పూర్తిచేశారని పేర్కొ న్నారు. మిగిలిన ప్రమోషన్లతోపాటు ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. కాగా, తెలం గాణ రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యా యులు ఎంతో కృషి చేశారని టీజే ఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదం డరాం అన్నారు. 2014 నుంచి ప్రమోషన్ల కోసం తనను చాలామం ది టీచర్లు అడిగేవారని, జీవితకా లంలో ఒక్కసారైనా పదోన్నతి పొందుతామా, లేదా అని బాధప డేవారని చెప్పారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మిగిలిన ఎస్జీటీ టీచర్లకు కూడా పదోన్నతులు కల్పిం చాలని, సర్వీస్ రూల్స్ను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.