–ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లో నే 30 వేల మందికి ఉద్యోగాలిచ్చాం
–రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హ స్తం చెక్కుల పంపిణీ లో సీఎం రేవంత్
CM Revanth: ప్రజా దీవెన, హైదరాబాద్: నిరు ద్యోగ సమస్యను ( problem of unemployment)శాశ్వతంగా పరి ష్కరించేందుకు కృషి చేస్తు న్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అంద జేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయ బో తున్నట్లు చెప్పారు.రాజీవ్ గాం ధీ సివిల్స్ అభయ హస్తం చెక్కు ల పంపిణీ కార్యక్రమా న్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సచివాల యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో లబ్ధిదారులకు రేవంత్ చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థు లకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున అందజేశారు.ఈ సంద ర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించా రు.
మెయిన్స్ లో (mains) ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028 ఒలింపిక్స్లోలో తెలంగాణ అథ్లెట్లకు (For Telangana athletes in Olympics) అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు (Residential Schools of India) ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసింది. 10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియ మిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతు న్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.” అని రేవంత్ అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అభ్యర్థులకు ఇలా సాయం చేయడం మొదటిసారి అన్నారు. అభ్యర్థులకు ఎంతోకొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో చెక్కుల పంపిణీ చేస్తున్నామంటూ డిప్యూటీ సీఎం చెప్పారు. ఇది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం (Balaram)తదితరులు పాల్గొన్నారు.