–టీ 20 మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు –కమీషనర్ సుధీర్ బాబు ఐపిఎస్
Commissioner Sudhir Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో (Rajiv Gandhi International Stadium) త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు (Commissioner Sudhir Babu) ఐపిఎస్ ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసిపిలు, జిహెచ్ఎంసి, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మరియు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భం గా సీపీ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలి పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో (Rachakonda Commissionerate Range) క్రికెట్ పోటీలు నిర్వహిం చడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబ స్తు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించినట్టు పేర్కొన్నారు. టికెట్ల పంపిణీలో (Distribution of tickets)ఎటువంటి గంద రగోళం లేకుండా చూడాలని నిర్వ హణ బృందానికి సూచించారు.
ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవస రమైన పార్కింగ్ (Parking) ఏర్పాట్లు చేయా లని సూచించారు. సాధారణ వాహ నదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను (cctv) ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు. ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, హెచ్ సి ఎ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు, హెచ్ సిఎ వైస్ ప్రెసిడెంట్ దల్జీర్ సింగ్, డీసీపీ ఎస్బి కరుణాకర్, ఎస్ఓటి డిసిపి రమణారెడ్డి, విమెన్ సేఫ్టీ డిసిపి ఉషా విశ్వనాథ్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, అడిషనల్ డిసిపి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.