Congress vs BJP: కాషాయం..కాంగ్రెస్ ధమాకా దరహాసం
తెలం గాణ లోక్ సభ ఎన్నికల్లో కషాయం, కాంగ్రెస్ పార్టీలు సాధించిన విజ యంతో డబుల్ ధమాకా దరహా సాన్ని ప్రదర్శిస్తుండగా గులాబీ పార్టీ మాత్రం వాడుపట్టింది.
తెలంగాణలో చెరి ఎనిమిది స్థానా ల్లో విజయకేతనం
కారు జీరోతో కకావికలం, హైదరా బాద్ను నిలబెట్టుకున్న మజ్లిస్
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections)కషాయం, కాంగ్రెస్ పార్టీలు సాధించిన విజ యంతో డబుల్ ధమాకా దరహా సాన్ని ప్రదర్శిస్తుండగా గులాబీ పార్టీ మాత్రం వాడుపట్టింది. తెలంగాణ లో కమలం, హస్తం పార్టీలు చెరి సగం స్థానాలతో బరాబర్ పట్టు సాధించి సంబరాలు జరుపుకుంటు న్నారు. ఇక హైదరాబాదును మజ్లి స్ పార్టీ నిలబెట్టుకోగా పదేళ్లు అధి కారంలో ఉన్న గులాబీ పార్టీ జీరో తో బెజార్ అయింది. కాగా ఈ ఎన్నికల్లో ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు ఎగబాకి 8 స్థానాలతో పాటు ఓట్ల శాతమూ21 శాతానికి పెంచుకుంది. అధికార కాంగ్రె స్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్ల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆ ర్ఎస్(BRS) మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది. ఒక్క సీటును కూడా సాధించలేక చతికిలపడి ఓట్ల శాత మూ దారుణంగా తగ్గి పోయింది. మొత్తంగా లోక్సభ ఎన్నికల్లో తెలం గాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చా రు. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ లకు చెరో ఎనిమిది సీట్లు ఇచ్చి ‘సమ ధర్మంపాటించారు. ఎంఐఎం ఎప్ప టిలాగే హైదరాబాద్ స్థానాన్ని నిలబె ట్టుకుంది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్క ర్నూల్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలు చుకోగా, సికింద్రాబాద్, మల్కాజి గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్న గర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ అభ్యర్థుల విజయకే తనం… దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు కలిగిన మల్కా జిగిరి పార్లమెంటు నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender)తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్య ర్థి పట్నం సునితా మహేందర్రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ పార్లమెం ట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ ఉ న్నా ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియో జకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్రె డ్డి రెండోసారి పాగా వేశారు.ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్య ర్థి దానం నాగేందర్పై 52,792 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా బిఆర్ఎస్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ను తమ పార్టీ లో చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయినా కిషన్రెడ్డి(Kishan Reddy)గెలుపును అడ్డుకోలేకపో యింది. కాగా, నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్య ర్థి ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డిపై లక్షా 9వేల 241 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీని సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రధాని మోదీ కరిష్మా, పసుపు బోర్డు ఏర్పాటు.. అర్వింద్ గెలుపులో కీల కపాత్ర పోషించాయి.
ఆటుపోట్ల నడుమ డీకే అరుణ విజయం… మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయకేతనం ఎగుర వేశారు. ఫలితంపై చివరిదాకా ఉత్కంఠ కొనసాగిన ఈ స్థానంలో ఆమె తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిపై 45 00 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలు పొంపదారు. రౌండ్, రౌండ్కు ఆధి క్యం ఇరువురి మధ్య మారుతూ వచ్చింది. ఈవీఎం ఓట్లలో డీకే అరుణకు 1800 మెజారిటీ మాత్ర మే రాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో మెజారిటీ మరింత పెరిగింది. కరీం నగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజ య్కుమార్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెదక్ లో రఘనందన్రావు(Raghanandan Rao)జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39, 139 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ మరో సారి సత్తా చాటింది. ఆ పార్టీ అభ్య ర్థి గోడం నగేష్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,932 ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. కాగా, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి 2,22,170 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్పై విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి బూర నర్సయ్య గట్టి పోటీ ఇచ్చారన్న ప్రచారం జరినప్పటికీ ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. కాగా, పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,771 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివా్సపై విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్ ప్రభంజనం.. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ప్రభం జనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67, 847ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఘనవిజయం విజయం సాధిం చారు. ఖమ్మంలో కాంగ్రెస్ కు ముగ్గు రు మంత్రుల రూపంలో బలమైన నాయకత్వం, ఓటుబ్యాంకు ఉండ డంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ భారీ ఆధిక్యాలను సొంతం చేసు కుంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ(Congress Party)కైవసం చేసు కుంది. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగిన సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)సన్నిహితు డు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్కకు సోదరుడైన డాక్టర్ మల్లు రవి విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్ప్రసాద్పై 94,914 ఓట్ల మెజా ర్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మూడో స్థానానికి పరిమితం కావ డం గమనార్హం.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అరూరి రమే్షపై 2,19,691 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో వరం గల్లో 15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కు గెలుపు లభించినట్లయింది. మహబూబాబాద్లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తన సమీప ప్రత్య ర్థి మాలోతు కవితపై 3,46,089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ 47,893 ఓట్ల మెజార్టీతో సిటింగ్ ఎంపీ బీబీ పాటిల్పై(MP Bibi Patil)గెలు పొందారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినా ఓటమిని తప్పించుకోలేకపోయారు.ఫినిక్స్ పక్షిలాగా పుంజుకుం టాం: కేటీఆర్ …లోక్సభ ఎన్ని కల ఫలితాలు నిరాశను కలిగించా యని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అయితే దీంతో కుంగిపో కుండా మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న నమ్మకం తమకు ఉందని మంగ ళవారం ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన తెలిపారు. ఫినిక్స్ పక్షిలా తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతిపెద్ద గౌరవమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపిం చాక ఈ 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశా మని, అద్భుత విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొ న్నామని చెప్పారు. తాము 201 4లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తే 2018 లో 88 స్థానాలతో రెండోసారి గెలుపొందామన్నారు. అలాగే ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
Congress vs BJP Telangana elections