Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram project: అబద్ధాలతో అంతే సంగతులు

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ అన్నారు.

కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు
బ్యారేజీల వైఫల్యానికి కారణా లేమిటో చెప్పాల్సిందే
విచారణలో వెల్లడించిందే అఫిడవిట్ లో ఉండాల్సిందే
అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశం

ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల(Kaleshwaram Project Barrage)నిర్మాణంతో ముడిపడిన అంశాలపై వివరాలు చెప్పే అధికారులు వాటికి కట్టుబడి ఉండాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(Justice Pinaki Chandra Ghosh)అన్నారు.విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్ లో పొందుపరచాలన్నారు. అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు వాస్తవ విరు ద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేం దుకూ వెనుకాడబోమని హెచ్చరిం చారు.ఈ నెల 25వ తేదీలోగా అఫిడవిట్లను అందజేయాలని ఆదేశించారు.

ఏ కారణాలతో బ్యారే జీల వైఫల్యం జరిగిందో సవివరంగా కమిషన్కు వివరించాల్సిందేనని స్పష్టం చేశారు. కాళేశ్వరంలోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ, నాణ్యత, నిర్వ హణ లోపాలు, అవినీతి, నిధుల దుర్వినియోగాన్ని ‘కాళేశ్వరం’పై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులువెలికితీసి వాటికి బాధ్యులను గుర్తిం చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మంగళవారం క్షేత్రస్థాయిలోని ఇంజ నీర్లను పలు అంశాలపై ప్రశ్నించా రు.

వానాకాలానికి ముందు, తర్వా త బ్యారేజీల స్థితిగతులపై తెచ్చు కున్న నివేదికల పై స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(State Dam Safety Organization)అధికారులను విచా రించారు.బ్యారేజీల నాణ్యత ఏ విధంగా ఉందని క్వాలిటీ కంట్రోల్ అధికారులను ప్రశ్నించారు. అనం తరం విచారణ జరుగుతున్న తీరు ను ఆయన విలేకరులకు వివరిం చారు. బ్యారేజీల డిజైన్లు(Designs of barrages), నిర్మాణం, నాణ్యత వంటి అంశాలపై అధికా రులను పిలిచి వివరాలు స్వీకరిస్తు న్నట్లు తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులనూ పిలుస్తామన్నారు. కమిషన్కు 54 మంది దాకా ఫిర్యా దులు చేశారని, వీటిలో భూసేక రణ, పరిహారానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని, వీటిని ప్రభుత్వానికి నివేదించామని పేర్కొ న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలే కాకుండా ఇతర కాంపో నెంట్లపై కూడా ఫిర్యాదులు అందా యని, అవి విచారణ పరిధిలో లేనందున వాటిపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి నివేదించను న్నట్లు తెలిపారు.విచారణలో భాగం గా అధికారులు అందించిన వివరాలు, కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్(Vigilance and Enforcement)అధికారుల నివేదిక లతోపాటు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలన్నింటినీ పరిశీ లించాక తదుపరి ఎవరెవరిని పిలవాలనే దానిపై నిర్ణయం ఉం టుందని జస్టిస్ పీసీ ఘోష్ అన్నా రు. ప్రస్తుతం సాంకేతిక అంశాలను పరిశీలించడానికి తెలుసుకోవడానికే పిలుస్తున్నామని, ఆ తరువాత ఉల్లంఘనలపై దృష్టి పెడతామని అన్నారు. కమిషన్ విచారించిన వారిలో ఈఎన్సీ (ఓఅండ్రం) బి. నాగేంద్రరావు, మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి(Chief Engineer Ramana Reddy), ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్లు నూనె శ్రీధర్, ఓంకా రేశ్వర సింగ్ తదితరులు ఉన్నారు.

Criminal cases lying Kaleshwaram project