Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CS Shanti Kumari: స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లు ముమ్మరం

–అధికారులతో కలిసి పరిశీలించిన సిఎస్ శాంతి కుమారి

CS Shanti Kumari: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే (KCR)గోల్కొండపై జెండా (Flag on Golconda)ఎగురవేసేవారు. కాగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనం గా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపైనే ప్రారంభిస్తారు.

సీఎం హోదాలో ఆయన తొలిసారి గోల్కొండపై త్రివర్ణ పతాకం ఎగుర వేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మం, అభివృద్ధి ఫలాలు వివరిస్తూనే గత బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాల ను ఎత్తిచూపుతూ ప్రసంగం సాగ నుంది. ముఖ్యమంత్రి సహా, ప్రము ఖులు గోల్కొండ కోటకు తరలిరా నుండటంతో ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి సోమవారం పరిశీ లించారు.అమెరికా పర్యటన ము గించుకుని వచ్చి గోల్కొండలో ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. వర్షం కురిస్తే వేడుకలకు హాజర య్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ పై దృష్టి సారించాలని పోలీసులను ఆమె ఆదేశించారు. కాగా ఈ స్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదా యా లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నా యి.

పరేడ్ రిహార్సల్స్.. ఓ వైపు సీఎస్ ఆదేశాలతో (CS orders) అధికారులు పరుగులు పెడుతుంటే.. అదే స్థాయిలో గోల్కొండ కోట ముస్తా బవుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్స వాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోం ది. జెండా వందనం చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు రానున్న నేపథ్యంలో అనేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల ముందు నిర్వహించే పరేడ్‌కి సంబంధించి రిహార్సల్స్ కూడా జరుగుతున్నా యి. సాంస్కృతిక కార్యక్రమా లతోపాటు, ఈ పరేడ్ స్వాతంత్ర్య వేడుకల్లో (Independence celebration) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.