–అధికారుల ఉన్నతస్థాయి సమా వేశంలో సిఎస్ శాంతి కుమారి
CS Shanti Kumari: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షా లు, వరదల వలన జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాం తంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari)ఆదేశించారు. వర్షాలు, వరదల (Rains and floods)వలన జరిగిన నష్టం అంచనా వేయడం పై మంగళ వారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ ఓ డీ (ho)లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. డీజీపీ డా.జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ రావు, రవీ గుప్తా, వికాస్ రాజ్, అర్వింద్ కుమార్, ముఖ్య కార్యద ర్శులు దాన కిషోర్, నవీన్ మిట్టల్, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, రఘునందన్ రావు, లోకేష్ కుమార్, రోనాల్డ్ రోస్, ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లా డుతూ ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదని అన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయ డానికి సంబంధిత శాఖల బృం దాలను క్షేత్ర స్థాయికి పంపి, తగు జీపీఎస్ కోఆర్డినెట్ లతో సహా సమర్పించాలని తెలిపారు. అదే విధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (State Disaster Management)ఫోర్స్ లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివ రాలు వెంటనే సమర్పించాలని అ న్నారు. ఈ వర్షాలు, వరదల (Rains and floods) వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ స మావేశంలో జీహెచ్ ఎంసీ కమీషన ర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఎస్ పి డి సి ఎల్ సీఎం డీ ముషారాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ హను మంత రావు, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ నర్సింహా రెడ్డి లు కూడా పాల్గొన్నారు.