Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyberabad Commissionerate: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్ఐ ల బదిలీ

ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ (HYDERABAD)నగరంలోని సైబరా బాద్‌ కమిషనరేట్‌ (Cyberabad Commissionerate) పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు (SI)బదిలీ అయ్యారు. ఆయా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 27 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్‌ మహంతి (CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌జీఐ ఎయిర్‌ పోర్ట్‌ ఎస్‌ఐ జి.మనియామ్‌ కేపీహెచ్‌బీకి, కేపీహెచ్‌బీ ఎస్‌ఐ కె.సత్యనారాయణ మైలార్‌దేవు పల్లికి, అత్తాపూర్‌ ఎస్‌ఐ కె.నాగ రాజు రాయదుర్గం ట్రాఫిక్‌కు, బాలా నగర్‌ ఎస్‌ఐ అశోక్‌ లిగెపల్లి అత్తా పూర్‌కు, రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ పి.రవికిరణ్‌ ఎస్‌వోటీ బాలానగర్‌ జోన్‌కు, ఆర్‌జీఐఏ ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న టి.వెంకటేశ్వ రావును మాదాపూర్‌ ట్రాఫిక్‌కు, సీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌.మౌనికను పేట్‌బషీరాబాద్‌ పీఎస్‏కు, కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ ఎస్‌ఐ జి.శశిధర్‌ను ఐటీసెల్‌ సీపీఏ సైబరా బాద్‌కు, ఐటీ సెట్‌ సైబరా బాద్‌లో విధులు నిర్వహిస్తున్న సయ్యద్‌ నజీర్‌ మియాన్‌ను కేపీహెచ్‌బీకి బదిలీ అయ్యారు.అలాగే ఐటీసెల్‌ సైబరాబాద్‌లో విధులు నిర్వహి స్తున్న రూపను కేపీహెచ్‌బీకి, గచ్చిబౌలి ట్రాఫిక్‌లో విధులు నిర్వ హిస్తున్న ఎ.కృష్ణను మైలార్‌దేవ్‌ పల్లికి, చెవెళ్ల నుంచి ఆర్‌. వీరభ్రహ్మ మ్‌ను గచ్చిబౌలి ట్రాఫిక్‌కు, మైలార్‌ దేవ్‌పల్లి ఎస్‌ఐ నయీమ్‌ హుస్సే న్‌ను కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌కు, సీసీఆర్‌ బీకి చెందిన కె.రాజేశ్వర్‌ రెడ్డి మియాపూర్‌కు, మియాపూర్‌ ఎస్‌ఐ ఎం.రాజు సీసీఎస్‌ బాలానగర్‌ జోన్‌, పేట్‌బషీరాబాద్‌ ఎస్‌ఐ జి.సరిత కేపీహెచ్‌బి ట్రాఫిక్‌కు, సీసీఎస్‌ బాలానగర్‌ ఎస్‌ఐ దాసరి బాల్‌రాజ్‌ ఎస్‌వోటీ మాదాపూర్‌ జోన్‌, ఎస్‌ఓ టీ మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఐ బి.నర్సింహారెడ్డి మియాపూర్‌కు, ఎస్‌ఓటీ బాలానగర్‌ జోన్‌ ఎస్‌ఐ మామిడి కిషోర్‌ రాజేంద్రనగర్‌కు, రాయ్‌దుర్గం ట్రాఫిక్‌లో (Raidurgam traffic) విధులు నిర్వహిస్తున్న మలావత్‌ పరు షురామ్‌ను శామీర్‌పేట్‌ (Sameerpet) పీఎ్‌సకు బదిలీ చేశారు.