–మహిళా శిశు సంక్షేమ శాఖ మం త్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
Dhanasari Anasuya Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో మహి ళల భద్రత కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టను న్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూ య సీతక్క (Dhanasari Anasuya Sitakka) తెలిపారు.మహిళా భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై సచివా లయంలో సమీక్ష నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్య దర్శి వాకాటి కరుణ, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా భద్రతా విభాగం డీజీ షిఖా గోయల్ (DG Shikha Goyal), డీఐజీ రెమా రాజేశ్వరితో స్పెషల్ డ్రైవ్ విధి విధానాలపై చర్చించారు. స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి సూచించారు. సొంత నివాసాల్లో, దగ్గరి మనుషుల నుంచి మహిళలకు వేదింపులు పెరగ డం భాదాకరమన్నారు. భాదిత మహిళలు బహిరంగంగా మాట్లాడేలా దైర్యం కల్పిస్తా మన్నారు. సమాజంలో ఆలోచన మారే విధంగా ప్రాణాళిక రూ పొందిస్తామని వెల్లడించారు.
విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో అవేర్ నెస్ క్యాంపేయిన్( Awareness campaign) లు చేపడుతామన్నా రు.మహిళా మంత్రులు, ఉన్నతాధి కారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మహిళా భద్రత కోసం స్వయం సహాయక సంఘాల సహాయాన్ని తీసుకుంటామన్నారు. మహిళా సంఘాల్లో ( In women’s societies) 63 లక్షల మంది సభ్యులున్నారని…మహిళా సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళ లను వేదించకుండా పురుషులకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని సమావేశంలో నిర్ణయిం చారు. మహిళలను గౌరవించడం, నేరాలు జరిగినప్పుడు పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని..ఇందు కోసం పాఠ్యాం శాల్లోనూ వీటిని చేర్చాలని అభిప్రా యం వ్యక్తం చేసారు. కాగా ఇదే అం శంపై మరో సారి సమావే శమవ్వా లని నిర్ణయించారు.