DRUGS: ప్రజా దీవెన, హైదరాబాద్: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీ నం చేసుకున్నారు. ఇద్దరు అంతరా ష్ట్ర నిందితులను పోలీసులు అరె స్టు చేశారు. నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్, ద్విచక్రవాహ నం, మొబైల్స్ సహా ఇతర వస్తువు లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మీడియాకు రాచకొండ కమిషనరే ట్ సీపీ సుధీర్ బాబు వివరాలు తెలిపారు. నిందితులు రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్ గుర్తిం చినట్లు చెప్పారు. హైదరాబాద్లో అధిక ధరలకు నిందితులు హెరా యిన్ విక్రయిస్తున్నారని అన్నారు. నిందితులు రాజస్థాన్కు చెందిన వారైనా నేరేడ్మెట్ పరిధిలో స్థిరప డ్డారని అన్నారు. వినియోగదారు లకు డ్రగ్స్ చేరవేయడంలో డిఫ రెంట్ మెథడ్స్ వాడుతున్నారన్నా రు. నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసే వారిగా పనిచేస్తున్నార ని తెలిపారు.
గ్యాస్ రిపేర్కు సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అన్నారు. గ్యాస్ సిలిండర్ వాల్వ్లలో ప్యాక్ చేసి విక్రయి స్తున్నారని తెలిపారు. అనుమానం రాకుండా ఇలాంటి టెక్నిక్స్ వాడు తున్నారని చెప్పారు. వోలా, ఊబ ర్, రాపిడో సహా ఇతర మార్గాల ద్వారా వీటిని కస్టమర్లకు చేరవే స్తున్నారన్నారు. 200 గ్రాముల హెరాయిన్ లక్ష రూపాయలకు కొనుగోలు చేసి, దానిని దాదాపు రూ. 23 నుంచి 25 లక్షల వరకు విక్రయిస్తున్నారన్నారు.రాజస్థాన్కు చెందిన శంషుద్దీన్ అనే డ్రగ్ పెడ్లర్ నుంచి నిందితులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు రాచకొండ పరిదిలో దాదాపు రూ. 88 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించేందు కు నిరంతరం కృషి చేస్తూనే ఉంటా మని చెప్పారు. పిల్లలు, యువత ఇలాంటి మత్తు పదార్థాలకు బలికా వద్దంటే ప్రజల సహకారం కూడా కావాలని చెప్పారు. డ్రగ్స్ సమా చారం ఉంటే తమకు తెలియజే యాలన్నారు. వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. కళాశాలల్లోకి వెళ్లి యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్పై అవగాహన కల్పి స్తున్నామన్నారు. నిన్న జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి తమ కమిషనరేట్ పరిధిలోని పోలీ సులు కూడా వారిని పట్టుకునేందు కు చర్యలు చేపట్టారని సీపీ సుధీర్ బాబు తెలిపారు.