Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Duddilla Sridhar Babu: సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో అగ్రభాగాన నిలుద్దాం

— బెంగుళూరు ను మించి 25 శాతం వృద్ది సాధిస్తాం
–ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Duddilla Sridhar Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేం దుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) వెల్లడించారు. అమెరికా పర్యటన (America tour)సందర్భంగా తనను శనివారం సచివాల యంలో తనను కలిసిన మీడియా ప్రతిని ధులతో ఆయన మాట్లాడారు. గత మార్చి31 వరకు ఐటీ ఎగుమతులు రూ. 2.7 లక్షల కోట్లు ఉండగా జూన్ చివరి నాటికి అది రూ.2.9 లక్షల కోట్లకు పెరిగిందని శ్రీధర్ బాబు వెల్లడించారు.

11.28 శాతం వృద్ధిని నమోదు చేసామని తెలిపారు. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల ఎగుమతితో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వివరించారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. వృద్ధి రేటును 11.28 శాతం నుంచి 25 శాతానికి తీసుకెళ్లే రోడ్ మ్యాప్ (Road map)సిద్ధమైందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ (Artificial Intelligence City) ఆవిర్భావంతో దేశంలోనే కాక ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక పెద్ద ఏఐ హబ్ గా (AI HUB)రూపొందుతుందని అన్నారు. కృత్రిమ మేథ వల్ల లక్షలాది మంది కోడింగ్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించే మొట్టమొదటిగా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోడింగ్ లో నైపుణ్యం ఉన్న 2 లక్షల మంది ఇంజనీర్లను ఏఐ లో నిపుణులుగా తయారు చేస్తామని వెల్లడించారు. కొత్తగా వేలాది మంది ఉపాధి పొందగలుగుతారని చెప్పారు. తాము ప్రారంభించబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను డిజిటిల్ క్లాసుల ద్వారా నూతన అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతుందని తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి కలిగిన నాయకుడని ప్రస్తుత అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా ఇండస్ట్రీ దిగ్గజాలతో ఆయన సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. కృత్రిమ మేథ రంగంలో యావత్తు ప్రపంచం తెలంగాణా వైపు చూసేలా తాము భవిష్యుత్తు ప్రణాళికలు రూపొందించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.

బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బిఎఫ్ ఎస్ ఐ) కన్సార్టియం హైదరాబాద్ లో మొదటి ఏడాది 2 వేల మందికి శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులను చేస్తుందని శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) వెల్లడించారు. ప్రస్తుతం ఫిన్ టెక్ రంగంలో 20 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నా నిపుణులైన మానవ వనరులు లేని పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. బికాం, బిబిఏ లాంటి కోర్సులు చదివిన విద్యార్థులను సెకండియర్, థర్డ్ ఇయర్ లో ఎంపిక చేసి శిక్షణ ద్వారా జాబ్ (job) రెడీ చేస్తామని వివరించారు. దేశంలో ఈ దిశలో మనమే ముందు కార్యాచరణ ప్రారంభించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.