Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Farmer’s Assurance: బరాబర్ రైతు ‘భరోసా’ ఎవరికి వస్తుందో తెలుసా, విధివిధానాల రూపకల్పనలో అధికారులు

ప్రజా దీవెన, హైదరాబాద్: అన్నదా తలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోన్న రైతు భరోసా సాకారమయ్యే సమయం ఆసన్న మవుతోoది. నూతన సంవత్సరం లో రైతు భరోసాను అమలు చేయా లని నిర్ణయించిన సర్కారు ఆమేర కు విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. రైతు భరోసాను బీఆరెస్ ప్రభుత్వం ఎలాంటి పరి మితి లేకుండా భూమి ఉన్న రైతు లందరికీ రైతుబంధు అందించింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అర్హు లైన రైతులకు, సాగు భూములకు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు పలుసార్లు సీఎం రేవం త్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా స్టేట్ మెంట్లు ఇచ్చిన విషయం తెలి సిందే. బీడు భూములకు, సాగులో లేని భూములకు, లే అవుట్లకు కూ డా గతంలో రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేశారని కాం గ్రెస్ ఆరోపించింది. తాజాగా ఇలాం టి దుబారాకు తావు లేకుండా, సాగు చేస్తున్న భూమికి, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు.

సన్న, చిన్న, మధ్య తరగతి రైతులకు మాత్రమే …రైతు భరో సా భూ స్వాములకు కూడా సన్న, చిన్న, మధ్య తరగతి రైతులకు మాత్రమే అందించాలన్న నిర్ణయా నికి రేవంత్ సర్కారు వచ్చింది. ఇందులో భాగం గానే రైతులకు సీలింగ్ విధించే అంశంపై సమాలోచనలు చేస్తు న్నది. రైతు భరోసాను 5 ఎకరాలకు పరిమితం చేయాలా లేక 10 ఎక రాల వరకు అందించ వచ్చునా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతి నిధులతోపాటు మండల, జిల్లా స్థాయి నేతల నుంచి అభిప్రా యాలు సేకరిం చినట్లు విశ్వస నీయ సమాచారం. అదే సమ యంలో ఐటీ చెల్లింపు దారులు ఉంటే.. వారికి సైతం మినహాయిం చాలా అనే విష యంలోనూ సంప్ర దింపులు జరుపుతున్నట్టు తెలిసిం ది.

రైతు భరోసా నుంచి భూస్వా ములను, కంపెనీల కు చెందిన భూములను కూడా మినహాయిం చాలన్న నిర్ణయానికి సర్కారు వచ్చిందని సమాచారం. వందల ఎకరాల భూములున్న భూస్వా ములకు సర్కారు పెట్టు బడి సా యం అందించాల్సిన అవ సరం లేదని రేవంత్ సర్కారు భావిస్తోం ది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల కు వెళ్లినా ఎకరం భూమి ముప్పై లక్ష్లల రూపాయల వరకు ధర పలుకుతున్న నేపథ్యంలో పెద్ద రైతులు, భూస్వాములు తమ భూములు సాగు చేయడానికి పెట్టుబడి పెట్టుకునే శక్తి ఉంటుం దని, అలాంటి వారికి రైతు భరోసా అవసరం లేదని అంటున్నది. భూమి సాగుకు పెట్టుబడి పెట్ట డానికి డబ్బులు లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారికి మాత్రమే సహకారం అందించా లన్న నిర్ణయంతో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

అలా పేద రైతులకు పెట్టుబడి సహాయం అం దించడం ద్వారా వారిని ప్రై వేట్ వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల భారీ నుంచి తప్పించ వచ్చునని ప్రభు త్వం భావిస్తోంది. ఈ మేరకు రైతు భరోసాను 10 ఎకరాలకు పరిమి తం చేయాలన్న నిర్ణయంతో రేవం త్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఎకరాల భూములున్న రైతులు స్వయంగా వ్యవసాయం చేసుకుం టారన్న నమ్మకంతో సర్కారు ఉన్నది.

కౌలు రైతులకూ న్యాయం…
అలాగే కౌలు రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ సర్కారు ఆ దిశగా సమా లోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కౌలు రైతులను ఏవిధంగా గుర్తించాలన్న దానిపైన ఒక నిర్ణ యానికి వచ్చినట్లు లేదు. అయితే ఇటీవల మంత్రులు పలు చోట్ల మాట్లాడుతూ సాగు చేసుకునే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటనలు చేయడం గమ నార్హం. కానీ కౌలు రైతులకు సంబంధించి ఇప్పటి మరకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ స్పష్టమైన ప్రకటన చేయ కపోవడంతో నిజంగా తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా వస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. కాగా ఈనెల 30వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకోను న్నట్లు విశ్వసనీయ సమాచారం.