Fraudsters: ఉద్యోగాలు ఎరగా మోసగాళ్ళ ఆగడాలు
నిరుద్యో గమే ఆసరాగా మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు.
రైల్వే, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట దగాపడిన నిరుద్యోగులు
భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి ఉడాయిస్తున్న మోసగాళ్లు
రైల్ నిలయం కేంద్రంగానే సదరు కార్యకలాపాలన్న ఆరోపణలు
పాత్రధారులుగా కొందరు సిబ్బంది, అధికారులు సైతం
ప్రజా దీవెన, హైదరాబాద్: నిరుద్యో గమే(unemployed) ఆసరాగా మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. మోసగాళ్ల బారిన పడిన ఎంతోమంది నిరుద్యో గులు లక్షలాది రూపాయలు పోగొ ట్టుకొని లబోదిబోమంటున్నారు. సికింద్రాబాద్ కేంద్రంగా పరిపాలన కార్యకలాపాలు నిర్వహిస్తున్న రైల్ నిలయంలో పని చేస్తున్న కొంత మంది కిందిస్థాయి సిబ్బంది, అధికా రులు ఈ మోసగాళ్లతో కుమ్మక్కైన ట్లు ఆరోపణలు గుప్పుమంటున్నా యి.
రైల్వేలో(railway employees) ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠా లకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యా లయం రైల్ నిలయం అడ్డా గా మారిందనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. వాట్సాప్ గ్రూపు లు, వెబ్సైట్ల నుంచి నిరుద్యోగుల ఫోన్ నెంబర్లు సేకరించి మోసగాళ్లు వల విసరుతున్నారు. రైల్వేతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు విభాగాల్లో ఖాళీలను, బ్యాక్లాగ్లను భర్తీ చేస్తున్నారని మభ్యపెడుతున్నారు. ఆయా సంస్థ ల పేరిట నకిలీ లేఖలు సృష్టించి ఇంటర్య్వూలు నిర్వహించి, హాజరై నవారికి నకిలీ నియామక పత్రాలు కూడా అందించటం విశేషం.రూ.10 నుంచి రూ. 15 లక్షల వరకు వసూ లు చేసుకొని ఉడాయిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగులను కూడా వీరు మోస గించినట్లు తెలుస్తోంది. రైల్వేలో టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికిన ముఠా సభ్యులు హైదరాబాద్ కందికల్ భట్జీనగర్ ప్రాంతంలోని ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.12 లక్షలకు బేరం కుదర్చుకున్నారు. అయితే, రైల్వేలో టీటీఈ ఉద్యోగ నియామకాలు జరగడం లేదని ఆ అభ్యర్థి తెలుసు కొని వారిని నిలదీయ టంతో, వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రైల్వే లో లేదు కానీ, కావాలంటే తమిళ నాడు రాష్ట్ర ఎజీ (ఆకౌంటెంట్ జనరల్) కార్యాలయంలో ఎల్డీసీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఈ మేరకు ముఠా సభ్యుడు అనిల్కు మార్ ఓ ఫేక్ లెటర్తో చెన్నైలో సదరు నిరుద్యోగికి ఇంటర్య్వూ ఏర్పాటు చేశాడు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంచి నియామకప త్రాన్ని కూడా అందించాడు.
ఒప్పం దం మేరకు డబ్బులు తీసుకు న్నాడు. రెండు వారాల వ్యవధిలో ఉద్యోగంలో చేరడానికి మళ్లీ సమా చారం ఇస్తామని చెప్పి పంపిం చారు. కానీ, నెల గడిచినా సమాచా రం లేకపోవడంతో బాధితుడు తమిళనాడు ఎజీ కార్యాలయానికి వెళ్లి చూపగా అది నకిలీదని తేలిం ది. అనిల్కుమార్కు ఫోన్ చేస్తే స్వి చ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో మోస పోయినట్టు తెలుసుకుని బాధితు డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఈ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదని, ఆదాయపన్ను శాఖలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, రైల్వేలో క్లర్క్, టీటీఈ తదితర ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఈ ముఠా భారీ మొత్తంలో వసూలు చేసినట్టు స మాచారం. అయితే మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు పట్టుబడితే గాని మోసాలకు సంబంధించినపూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది.
Fraudsters fraud unemployed