Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ganesh immersions: నగరవాసులకు బిగ్ గుడ్ న్యూస్

–హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాల కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ganesh immersions: ప్రజా దీవెన, హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను (Ganesh immersions) నిషేధించాలంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ క్రమంలో హుస్సేన్ సాగర్‌లో ( Hussain Sagar) నిమజ్జనాలు (immersions)వద్దని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. నిమజ్జ నాల విషయంలో గతేడాది ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ‘హైడ్రా’ను కూడా ఇందులో ప్రతి వాదిగా చేర్చాలని కోరారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం ‘హైడ్రా’ (hydra)ను ప్రతివాదిగా చేర్చేందుకు నిరాక రించింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషనర్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. అదేవిధంగా ఆ పిటిషన్‌ను (Petitionధర్మాసనం తిస్క రించింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది.