Group 1 exams: అరగంట ముందే అప్రమత్తం
గ్రూపు–1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తు న్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి ముందే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గ్రూప్ – 1 ప్రీలిమినరీ పరీక్షకు అరగంట ముందే గేట్లు క్లోజ్
జూన్ 9న ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు పరీక్ష
ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రూపు–1 పోస్టుల భర్తీలో భాగంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) నిర్వహిస్తు న్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి ముందే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందుగానే అభ్యర్థులు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేస్తు న్నారు.శనివారం నుంచి అభ్యర్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ(TGPSC) తెలిపిం ది. గతంతో పోలిస్తే పరీక్ష నిర్వహణ లో కీలక మార్పులు చోటుచేసుకు న్నాయి.
ముఖ్యంగా ఓఎంఆర్(OMR) షీట్లో అభ్యర్థి ఫొటోను ముద్రిస్తు oడగా అభ్యర్థి పేరు, హాల్టికెట్ నంబర్, ఇతర వివరాలు కూడా ఓఎంఆర్ షీట్పై ఉంటాయి. దీని వల్ల హాల్టికెట్ బబ్లింగ్లో(Bubbling) జరిగే పొరపాట్లకు అడ్డుకట్ట పడుతుందని టీజీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి ఇంతకు ముందు రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు(Preliminary Examinations) జరిగి, రద్దయిన విషయం తెలిసిందే. మొదటిసారి 2022 అక్టోబరులో జరిగిన పరీక్షను ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా రద్దు చేశారు. ఆ తర్వాత 2023 జూన్లో జరిగిన పరీక్షను బయోమెట్రిక్ తీసుకోకపోవడం, ఇతర నిబంధ నలను పాటించలేదనే కారణంతో హైకోర్టు రద్దుచేసింది.
దీంతో రేవంత్(Revanth) సర్కారు ఎలాంటి విమర్శలకు తావులే కుండా, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని టీజీపీ ఎస్సీని ఆదేశించింది. దాంతో అధికారులు మరికొన్ని పోస్టులను చేర్చి, కొత్త నోటిఫికేషన్(Notification)ఇచ్చారు. పరీక్ష నిర్వహణలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 9న ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారని 10 గంటలు దాటితే లోనికి అనుమతించబో మని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటామ న్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు గానే అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లను ఇస్తారని, బుక్లెట్లను 10.30కు బెల్ మోగిన తర్వాతే తెరవాల్సి ఉంటుందని చెప్పారు.
Group1 exams on june 9th