Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gudem Mahipal Reddy: ఈడి దర్యాప్తు ముమ్మరం

–పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మ హిపాల్ రెడ్డి కేసు వేగవంతం
–ఎమ్మెల్యే కు సంబంధించి 1.2 కేజీల బంగారo ఈడీ స్వాధీనం

Gudem Mahipal Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) మనీలాండ రింగ్ కేసులో ఈడి (ED in ring case)తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యే కు సంబంధించి 1.2 కేజీల బంగారాన్ని ఈడీ తాజా గా స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్ లో నమోదైన మనీలాం డరింగ్ కేసుపై దర్యాప్తులో భాగంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ (Bank of India Branch)కు తీసుకెళ్లింది. అక్కడ ఎ మ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో కోటి విలువైన బంగారం దొరికింది. అదే సమయంలో, ఎమ్మె ల్యే సోదరుడు జి మధుసూధన్ రెడ్డి, ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే కొను గోలు చేసిన బంగారు బిస్కెట్ లకు రసీదులు కానీ, ఎలాంటి డాక్యుమెం టేషన్ లు లేవని ప్రాధమిక దర్యాఫ్తు లో తేలిందని సమాచారం.