–శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukhender Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి (Konda Laxman Bapuji Jayanti) సంద ర్భంగా తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy), ఎమ్మెల్సీ ఎల్ రమణ , లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు , నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)మాట్లాడుతూ ” బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసినా మహానుభావులు కొండా లక్ష్మణ్ బాపూజీగారని (Konda Laxman Bapuji) తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ఎంతో శ్రమించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం ఆయన త్యాగం చేశారని వివరించారు.
అదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అంచెలు, అంచెలుగా ఎదిగారని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు . పద్మశాలి వర్గం వారి అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji Jayanti) గారు మన మధ్యలో నేడు లేకున్నా ప్రజల హృదయాల్లో మాత్రం చిరకాలం ఉంటారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ ,శాసన మండలి ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు.