Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: బాధిత మహిళకు బిఆర్ఎస్ భరోసా

–న్యాయ జ‌రిగే వ‌ర‌కు పోరాడతాం జైనూర్ బాధిత మ‌హిళ‌కు అండ
–గాంధీ హాస్ప‌ట‌ల్లో బాదితురాలికి పరామర్శించిన నేతలు
–రేవంత్ ప్ర‌భుత్వంలో మ‌హిళ ర‌క్ష‌ ణ లేదంటూ హ‌రీశ్ మండిపాటు
–రాష్టంలో రోజుకి రెండు హ‌త్య‌లు, నాలుగు మానభంగాలు
–అయినా రేవంత్ రెడ్డి లో చ‌ల‌నం లేదంటూ విమ‌ర్శ‌
–ఆయ‌న దృష్టoతా విప‌క్షాల‌ను అరెస్ట్ ల‌పై పైనే
–శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడటంలో మాత్రం రేవంత్ వైఫ‌ల్యం

Harish Rao: ప్రజా దీవెన, హైద‌రాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘట నపై నిందితుడిని కఠినంగా శిక్షిం చాల‌ని బాధిత కుటుంబీకులు గ‌త కొన్ని రోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌ హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీఆ ర్ఎస్ నేతలు హరీష్ రావు, సునీ తా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి , తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మె ల్యే ముఠా గోపాల్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ త‌దిత‌రులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు ఆదివాసి బిడ్డను (Adivasi child) నేడు పరామర్శించారు.

బాధిత కుటుం బీకులకు ధైర్యం చెప్పారు. బాధితు రాల‌కి అన్ని విధాల అండ‌గా ఉం డ‌ట‌మే కాకుండా న్యాయం జ‌రిగే వ‌ర‌కూ తాము పోరాటం చేస్తామ‌ని బిఆర్ ఎస్ నేత‌లు హామీ ఇచ్చారు. కాగా ఈ సంద‌ర్బంగా తన తల్లిపై జరిగిన అఘాయిత్యంపై బాధితు రాలి కుమారుడు మాట్లాడుతూ, రాఖీ కట్టేందుకు తన తల్లి ఆటోలో వెళ్తుంటే అటవీ ప్రాంతానికి తీసు కువెళ్లి దాడి చేశారని వివరించా డు. హత్యాచార యత్నం చేయ డంతో, తనతల్లి ప్రతిఘటించిం దని, దీంతో ఆమెకు గాయాలు అయ్యాయని తెలిపాడు. అనంత‌ రం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యా చారాలు (Murder streaks)నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ (home departemnt)ఉన్నప్పటికీ.. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్న ట్టుగా పరిస్థితి తయార యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహిళల రక్షణకు షీ టీమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు.

గత పదేండ్లు తెలంగాణను కేసీఆర్‌ అద్భుతంగా పరిపాలించారు. శాo తి భద్రతలను పటిష్టంగా అమలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నా రని విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతున్నదని చెప్పారు. స్మగుల్డ్‌ వెపన్స్‌ బయటపడుతు న్నాయ‌న్నారు. ఒకప్పుడు బీహా ర్‌లో ఉండే నాటు తుపాకులు, తెలంగాణలో రాజ్యమేలుతు న్నా య‌ని వివ‌రించారు.కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నా రని విమర్శించారు. పోలీసులను ప్రభుత్వం పనిచేయనీయ ట్లేదన్నా రు. రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్‌ ఎన్‌ కౌంటర్లు చేస్తున్నదని ఆరోపించారు హ‌రీశ్ రావు.వ‌ర‌ద విప‌త్తు సాయం లోనూ వైఫ‌ల్య‌మే .

వరద విపత్తు సహాయం అందించడంలో లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను (Law and order, loan waiver, education system) నడిపించడంలో ప్రభు త్వం విఫలమైందని చెప్పారు. మొ త్తానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఫెయిల్ అయ్యార‌ని విమర్శిం చారు. ఎంత సేపూ ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్ట డం తప్ప పాలనను గాలికి వది లేశార‌న్నారు. మహిళను పరామ ర్శించడానికి సీఎం రేవంత్‌కు సమ యం దొరకడం లేదా అని ప్రశ్నించా రు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహి ళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్‌ రెడ్డి కనీసం స్పందిం చడం లేదని విమర్శించారు. హైద రాబాద్‌లో మహిళలకు భద్రత లేదు, భరోసా లేదని విమర్శిం చారు.