Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: హరీష్ హాట్ కామెంట్స్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వ విజయమే

–మొదటి నుంచి సెక్షన్ 3 ప్రకారం నీళ్లు కేటాయించాలని పట్టుబట్టిన కేసీఆర్
–తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన మ ధ్యంతర ఉత్తర్వులను స్వాగతి స్తున్నాం
–దీన్ని కూడా కాంగ్రెస్ తమ ఘన తగా చెప్పుకోవడం సిగ్గు చేటు
–అసలు ఏపీ పునర్విభజన చ ట్టం, సెక్షన్ 89 తెచ్చిందే నాటి కేం ద్రంలోని కాంగ్రెస్సే
–క్రిష్ణా జలాల విషయంలో తెలం గాణకు తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్
–క్రిష్ణాలో న్యాయమైన వాటా దక్కే దాక బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుంది
–మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజం

Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపు విషయంలో 1956 అంత రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేసారు.పదేళ్ల పాటు నిర్విరామం గా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ ప్రభు త్వం పట్టుబట్టి సాధించిన విజ యం అన్నారు. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతో ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభ వించడం వల్ల నదీ జలాల కేటా యింపుల్లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కేసీఆర్ కొట్లాడి సాధించి న విజయాన్ని సైతం తమ ఘనత గా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

ఏపీ పునర్విభజన చట్టం, సెక్షన్ 89ని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందన్నారు. క్రిష్ణా నీటి వాటా విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తే, దాన్ని సరిదిద్దడానికి పదేండ్ల కాలం పట్టిందన్నారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కులు సాధించేందుకు ఆనాడు కేసీఆర్ గారు సీఎం హోదాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణ పక్షాన వాదనలు వినిపించారని, దీంతో తెలంగాణకు న్యాయం దక్కే అవకాశాలు మెరుగు పడ్డాయని గుర్తు చేసారు.

తెలంగాణ ఏర్పాటు అయిన నెల రోజులకే సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆనాటి సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ 14.7.2014 నాడే లేఖ రాసినట్లు తెలిపారు. అయితే కేంద్రం ISRWD చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ వలన తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే ఆయన నిరంతరాయంగా ISRWD Act 1956, సెక్షన్ 3 ప్రకారం పున: పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు.
క్రిష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం 2015లోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. అక్టోబర్ 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టినట్లు గుర్తు చేసారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్ కి రిఫర్ చేయడానికి అంగీకరించిందన్నారు.

అయితే కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్ వేసేందుకు హామీ ఇవ్వాలని కెసిఆర్ పట్టు బడితే, మేము న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని నాడు కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి షెఖావత్ ను మరొక సారి డిల్లీలో కలిసిన తర్వాత ఆయన హామీ మేరకు నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ కేసును విత్ డ్రా చేయాలంటూ అధికారులను ఆదేశించారని తెలిపారు.

కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్ లో విత్ డ్రా పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టు అక్టోబర్ 2021 లో పిటిషన్ అనుమతించిందన్నారు.
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్టోబర్ 2023వ తేదీనే సెక్షన్ 3 కింద నీటి విభజన కోసం ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రెఫెరెన్స్ (TOR) ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఎన్నో వేదికల ద్వారా బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితమే తాజాగా సెక్షన్ 3 ప్రకారం వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలన్నారు. ఒకవైపు సెక్షన్ 3 ప్రకారం నీటి వాటా జరగాలని శాశ్వత పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే, మరోవైపు తాత్కాలికంగా నీటి వాటాను 50శాతం పెంచాలని పోరాటం కొనసాగించామన్నారు. ఇందులో భాగంగానే ట్రిబ్యునల్ ముందు 575 టిఎంసి ల నీటి వాటా డిమాండ్ పెట్టినట్లు గుర్తు చేసారు.

KRMB సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా తెలంగాణకు కృష్ణా జలాల్లో 50శాతం వాటా ఇవ్వాలని నిరంతరాయంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే వచ్చిందన్నారు. ఇప్పటికే 10 ఏండ్ల విలువైన కాలం హరించుకుపోయింది. Justice delayed is justice denied అనేది అందరికీ తెలిసిన న్యాయ సూత్రం. తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయింది. కనుక సెక్షన్ 3 కింద విచారణ త్వరితగతిలో పూర్తి చేసి న్యాయమైన వాటా వచ్చే విధంగా చేయాలని ట్రిబ్యునల్ ను బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాం. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా నదీజలాల కేటాయింపుల పై ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు వాదనలు వింటామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన నేపథ్యంలో పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీ ఆర్ ఎస్ పార్టీ తరపున సూచించారు.

సెక్షన్ 3 ప్రకారం వాదనలు వినేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పాక్షిక విజయమే అని, తెలంగాణ కు కృష్ణా నదీ జలాల్లో న్యాయమైన వాటా దక్కితేనే అంతిమ విజయం సాధించినట్లవుతుందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగురకత తో అంతిమ ఫలితాన్ని రాబట్టేలా కృషి చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత రైతుల పాలిట శాపం లా మారిందని, కాలువలు తవ్వితే రైతుల పొలాలకు నీలిచ్చే అవకాశమున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గం అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పజెబుతూ తీసుకున్న నిర్ణయాన్ని బీ ఆర్ ఎస్ ఒత్తిడి తెస్తే తప్ప మార్చుకోలేదని గుర్తు చేసారు. నీటి కేటాయింపుల కోసం కృషి చేస్తూనే ప్రాజెక్టుల సక్రమ నిర్వహణ అవసరం అని, యాసంగిలో తగిన నీటిని అందించాలని కోరారు. గత యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితినే రేవంత్ ప్రభుత్వం పునరావృతం చేస్తే అది రైతాంగం పాలిట చేసిన ద్రోహం లాగానే భావించాల్సి ఉంటుందన్నారు.

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా నీటి విడుదలకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని రైతుల నుంచి మాకు పిర్యాదులు అందుతున్నాయని, ప్రాజెక్టుల కింద రైతులు వేసిన పంటలకు నీరివ్వాల్సిన భాద్యత సాగునీటి శాఖదేనని స్పష్టం చేసారు. యాసంగి సాగునీటి ప్రణాళిక లో అదనంగా మరిన్ని ఎకరాలను చేర్చాలని, గత సంవత్సరం యాసంగిలో పంటలు ఎండిపోయిన పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృష్టి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, నీటి వాటా కోసం రాజీలేని పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్దమని ప్రకటించారు.