HMPV: ప్రజా దీవెన, హైదరాబాద్: వాతావరణంలో పెను మార్పుల కారణంగా తెలంగాణ జ్వరం బారిన పడుతోంది. ఉన్నఫళంగా ఎప్పటికప్పుడు వాతావరణం మారడంతో శ్వాసకోశ వ్యాధులు మూడో వంతుగా నమోదవుతు న్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం వెరసి ఇప్పటికే చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీ వీ వైరస్ కు ఈ పరిస్థితులు ఎక్కడ అనుకూలoగా మారుతుందో అన్న భయాందోళన లేకపోలేదు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తప్ప మరో మార్గం లేదని వైద్యు లు చెపుతున్నారు.
పడిపోతోన్న ఉష్ణోగ్రతలు….
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవ డంతో ఫ్లూ వైరస్ వ్యాప్తి గణనీయం గా పెరుగుతోంది. దీంతో ప్రతి ఇంటి లో సర్ది, దగ్గు, జ్వర బాధితులు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులు, ఇంకోవైపు కాలుష్య తీవ్రతతో అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాం తాల్లోనూ శ్వాసకోశ వ్యాధుల బారి న పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో చైనాలో విజృం భిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ లక్షణా లు కూడా ఫ్లూ, శ్వాసకోశ వ్యాధు లకు సంబంధించినవే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. గత వారం రోజులుగా ఓపీ తాకిడి ఎలా ఉందనే వివరాలను అధికా రులు సేకరిస్తున్నారు.
మూడో వంతు శ్వాసకోశ రోగులు… ఐదారోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రతతో పాటు పొల్యూషన్లెవెల్స్ పెరగడం కార ణంగా శ్వాసకోశ వ్యాధులతో బాధ పడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని డాక్టర్లు చెబుతు న్నారు. సాధారణ ఫ్లూ మాదిరిగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవస రం లేదని, కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టే శ్వాసకోశ సమస్యలు వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధన ల్లో కొన్నింటిని కొంత కాలం పాటిం చాలని చెబుతున్నారు. అన్ని ప్రభు త్వ హాస్పిటల్స్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో వచ్చే బాధి తులకు ఇబ్బందులు లేకుండా మెడిసిన్ అందుబాటులో ఉంచా లని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.
కొవిడ్ తర్వాత పెరిగిన రెస్పి రేటరీ సమస్యలు.. ఇన్ఫ్లూ యెంజా వైరస్ వల్ల ముక్కు, గొం తు, ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో ఇన్ఫ్లూయెం జా ఏ(హెచ్1ఎన్1) ఏటా సీజనల్ ఫ్లూలాగా వస్తుంటుందని వైద్యారో గ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ఫ్లూయెంజా ఏ, బీ వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై జనాలెవరూ కంగారుపడాల్సిన అవసరంలేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న ఫ్లూ వైరస్ మధ్యతరహా లక్షణాలతో అనారోగ్యానికి గురి చేస్తోందని, ఇవి హాస్పిటల్లో చేరేంత తీవ్రంగా లేవని చెప్తున్నారు.
కొవిడ్ తర్వాత సాధారణంగానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగాయి. అందుకే ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్లకు ఇన్ఫ్లూయెంజా ఏ(హెచ్ 1ఎన్1), ఇన్ఫ్లూయెంజా ఏ(హెచ్3 ఎన్3), ఇన్ఫ్లూయెంజా బీ, రెస్పిరే టరీ సిన్కైషియల్ వైరస్(ఆర్ఎ స్వీ), పారా ఇన్ఫ్లూయెంజా, అడె నో వైరస్లాంటి వివిధ రకాల పరీక్ష లు నిర్వహించాలని సర్కార్ దవా ఖాన్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్ఫ్లూయెంజా వంటి వాటి కార ణంగానే 75.4 శాతం పెద్దలు, పిల్ల ల్లో శ్వాసకోశ సమస్యలు వస్తున్న ట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్ఫ్లూయెంజా ఏ రకం వైరస్ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావంతో పాటు చలిజ్వరం, ఒళ్లు నొప్పులు, అలస టలాంటి లక్షణాలు ఉంటాయని, ఇది వర్షాకాలం, చలికాలంలో వ్యాపిస్తుంటుందని అంటున్నారు. అయితే, దీనితో దవాఖానలో చేరేంత తీవ్రత ఏమీ ఉండదని పేర్కొంటున్నారు.
అడ్డగోలుగా యాంటీబయా టిక్స్ వాడొద్దు… దగ్గు, జలుబు వంటి కేసులు పెరుగుతున్న నేప థ్యంలో విచక్షణారహితంగా యాం టీబయాటిక్స్ వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే చికిత్స తీసుకోవా లంటున్నారు. సాధారణ ఫ్లూ ఇన్ఫె క్షన్ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుం దని అంటున్నారు. చలికాలంలో మాస్క్ ధరించాని, తరచూ చేతుల ను శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. చల్లని పదార్థా లు తినొద్దని, వేడిగా ఉన్న ఆహారా న్నే తీసుకోవాలని చెప్తున్నారు.