Hyderabad Metro: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవల్ని వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రస్తుతం మూడు కాడిడార్లు నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో సేవలందిస్తోంది. మెట్రోకు ఆదరణ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను ప్రాతిపాదించింది. కారిడార్ 4లో భాగంగా నాగోల్ -శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు, కారిడార్ 5లో రాయదుర్గం -కోకాపేట్ నియోపోలిస్ వరకు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ – చంద్రాయణగుట్ట వరకు, కారిడార్ 7లో మియాపూర్ – పటాన్చెరు వరకు, కారిడార్ 8లో ఎల్బీనగర్ – హయత్ నగర్ వరకు, కారిడార్ 9లో RGIA – ఫోర్త్ సిటీ వరకు మెట్రో నిర్మిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా.. రెండు ఇంటర్ఛేంజ్ స్టేషన్లు (Interchange stations) నిర్మించనున్నారు. చాంద్రాయణగుట్టలో ఒకటి, ఎల్బీనగర్లో మరోక స్టేషన్ నిర్మించనున్నారు. ఈ రెండుచోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు ఉండటం ప్రస్తుతం మెట్రో అధికారులకు సవాలుగా మారింది. మెట్రో తొలిదశలో అమీర్పేట వద్ద అతిపెద్ద జంక్షన్గా ఉంది. ఈ స్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. కారిడార్-1, 3 ఈ స్టేషన్లోనే కలుస్తుంటాయి. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్వో మరో జంక్షన్ ఉంది. ప్రయాణికులు ఇక్కడ దిగి కారిడార్-1, 2లోకి మారిపోవచ్చు. పరేడ్ గ్రౌండ్ వద్ద మరో జంక్షన్ ఉండగా.. ఇక్కడ వేర్వేరు మార్గాలు రెండు వేర్వేరు స్టేషన్లు ఉన్నాయి. మొత్తం మూడు కారిడార్లలో మూడు ఇంటర్ఛేంజ్ స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు రెండో దశ మెట్రో ప్రాజెక్టులో (The second phase is the metro project) రెండు ఇంటర్ఛేంజ్ స్టేషన్లు (Interchange stations) నిరాబోతున్నాయి. ఎల్బీనగర్లో నాగోల్ నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గం, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ కారిడార్కు సంబంధించి ఎల్బీనగర్లో ( LB Nagar)ఇంటర్ఛేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్లో స్టేషన్ ఉన్నందుకు ఎయిర్పోర్టు మార్గంలో మరో స్టేషన్ను నిర్మించి రెండింటికి కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్ మాదిరి వాకలేటర్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. అయితే ఎల్పీనగర్ కూడలిలో ఫ్లైఒవర్, అండర్పాస్లు ఉండటంతో మెట్రో అధికారులకు సవాల్గా మారింది.