–తెలిసి నిబంధనలకు నిట్టనిలు వునా పాతరేశారు
–ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మాజీ ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల ని ర్మాణాలు
–హిమాయత్సాగర్, గండిపేటలో వ్యాపారులు, సినీ ప్రముఖుల భవనాలు
–బుమ్రుఖ్దౌలా చెరువులో కట్ట డాల వెనుక మజ్లిస్ నేతలు
–హైడ్రా ఆద్వర్యంలో ఇప్పటి వరకు 18 ప్రాంతాలు 44 ఎకరాల్లో కూల్చి వేతలు
–రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా పురో గతి నివేదిక సమర్పణ
HYDRA: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భాగ్యనగరంలో చెరువులు, పార్కులు, నాలాలు, ఎక్కడ పడితే అక్క డ ప్రభుత్వ స్థలాలను అధికారమే పరమావధిగా, అంది వచ్చిన అవ కాశంగా చెరపటట్టారు.ప్రజా ప్రతి నిధులు, రాజకీయ, అధికార అండ దండలున్న వ్యాపార, సినీ ప్రముఖులే (Business and film celebrities). నాయకుల్లో అధికార, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అప్పనంగా వస్తున్నాయన్న దుర్బుద్ధితో రకర కాల ప్రభుత్వ స్థలాలను తమ ఖా తాలో వేసుకున్నారు. ప్రస్తుత మాజీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారు, సినిమా తారలు, వ్యా పార వాణిజ్య వర్గాలు (Movie stars, business people) ఇలా ఒక్క రంటే ఒక్కరు కాదు ఎవరికి తోచిన విధం గా వారు చెరువులను చెరబట్టారు.
హైదరాబాద్ కబ్జాల్లో ప్రజాప్రతిని ధులు, ప్రముఖుల నుంచి చోటా నేతల వరకు అందరిదీ ఒకటే ప్రత్య క్ష, పరోక్ష అధికార ధర్పంతో చేసిన ఆక్రమణల పర్వం పూర్వపరాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడు పెంచడం ద్వారా ప్రపంచానికి వెల్లడిస్తోంది. అభివృద్ధి క్రమంలో భూముల ధర లు అనూహ్యంగా పెరగడంతో కబ్జా చేసి కొందరు తక్కువ ధరకు కొని ఇంకొందరు, ఈవీడీఎం, హైడ్రా లు మూడు నెలల్లో 18 ప్రాంతాల్లోని చెరు వుల గరిష్ఠ నీటి నిల్వ సామ ర్థ్యం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్, పార్కుల్లో పడగొట్టిన ఆక్రమణల్లో సింహభాగం రాజకీయ, వ్యాపార ప్రముఖులవే కావడo పెద్దగా ఆశ్చర్యమేం కాదు. ఇందులో ‘ఎన్’ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉండడం కోసమెరుపు. గండిపేట, తమ్మి డికుంట, బుమ్రుఖ్దౌలా (Gandipet, Tammi Dikunta, Bumrukhdaula)చెరవుల్లో నేరుగా కబళించగా, కొన్నిచోట్ల పేదలను ముందు పెట్టి కబ్జాకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 43.94 ఎకరాల్లో ఉన్న ఆక్రమణ లను తొలగించినట్లు హైడ్రా ఆది వారం ప్రకటించింది.
పార్కు స్థలాలకు పాతరేశా రు… హైదరాబాద్లో ఖరీదైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో (Jubilee Hills, Banjara Hills) పార్కులను చెరబట్టే ప్రయత్నం దశాబ్దాలుగా నడుస్తోంది. జూబ్లీ హిల్స్ నందగిరిహిల్స్లోని పార్కు స్థలంలో ఆక్రమణలు వెలిశాయి. దీనివెనుక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్ర ఉందని హై డ్రా గుర్తించింది. ఆక్రమణల తొల గింపుతో ఆగ్రహించిన దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర విమ ర్శలు చేశారు. దీంతో దానంపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్ లోటస్పాండ్లోని ఫిల్మ్నగర్ కో ఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నంబర్ 20 పక్కనున్న పార్కు స్థలంలో ప్రహరీ నిర్మించి వ్యర్థాలతో నింపారు. రం గంలోకి దిగిన హైడ్రా కాంపౌండ్ను కూల్చి స్థలాన్ని స్వాధీనం చేసు కుంది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పార్కు స్థలంలో రేకుల షెడ్లు నిర్మించగా కూల్చివేసింది. మిథిలానగర్లోనూ పార్కు ప్రదే శంలో రేకుల షెడ్లు వేయగా పడ గొట్టింది. ఫిల్మ్నగర్లోని బీజే ఆర్న గర్, అమీర్పేటలో నాలాలపై చేప ట్టిన నిర్మాణాలను తొలగించింది.
నాగార్జున ‘ఎన్’లో 4.9 ఎక రాల్లో.. ఖానామెట్లోని (Khanamet) తమ్మిడి కుంట చెరువులో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను పడగొట్టడం సంచలనం రేపింది. 14 ఏళ్ల క్రితం నిర్మించి, కో ర్టు స్టేల ద్వారా చర్యలు ఆగిన నిర్మా ణంపై చర్యలు చేపట్టడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైం ది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న 3.30 ఎకరాల్లో రెండు భా రీ, ఆరు సాధారణ షెడ్లను కూల్చి వేశారు. మొత్తంగా 4.9 ఎకరాలలో నిర్మాణాల కూల్చివేత జరిగిందని హైడ్రా పేర్కొంది.
చోటామోటా నాయకుల ఆగడా లు ఎన్నో… గాజులరామారంలోని చింతల్ చెరువు ఆక్రమణ సినిమా ను తలపించేలా జరిగింది. శిఖం పట్టా భూముల (lands) యజమానులతో బీఆర్ఎస్ స్థానిక నాయకుడు రత్నాకరం సాయిరాజు ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పేద లకు డబ్బులిచ్చి చెరువులో చిన్న గదులు నిర్మించాడు. 80, 100, 120 చదరపు గజాల చొప్పున మొ త్తం 54 ప్లాట్లు చేసి అప్పగించాడు. తక్కువ ధర కావడంతో మధ్య తర గతి వర్గాలు కొనుగోలుకు ఆసక్తి చూపాయి. అయితే, పూర్తిగా ఎఫ్ టీఎల్లో ఉన్నట్టు నిర్ధారణకు వచ్చి ఈ నెల 6వ తేదీన మొత్తం 54 ని ర్మాణాలను పడగొట్టింది. కాగా, ఒక్కో గది నిర్మాణానికి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చుపె ట్టిన సాయిరాజు ప్లాట్ల ద్వారా రూ.కోట్లు సంపాదించాడు. ఇందు లో భూ యజమానులకు కొంత, గదులు నిర్మాణం చేపట్టిన పేదలకు కొంత ఇచ్చాడు. గాజులరామారం లోని భూదేవిహిల్స్ పరికి చెరువు బఫర్ జోన్లో నిర్మించిన బేస్మెం ట్లను, మహదేవపురం పార్కులో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనాన్ని, చందానగర్ ఈర్ల చెరు వులో జీహెచ్ఎంసీ అనుమతి పొం దినా ఎఫ్టీఎల్లో ఉండడంతో జి ప్లస్ 3, జి ప్లస్ 4 భవనాలను హైడ్రా పడగొట్టింది. నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళికా విభా గం అధికారులు నివాసయోగ్య ప త్రం (ఓసీ) ఇచ్చినట్టు గుర్తించింది. హెచ్ఎండీఏ అనుమతులతో స్టిల్ట్ ప్లస్ ఐదంతస్తులుగా నిర్మించిన 3 భవనాలు ప్రగతినగర్ ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉండడంతో నేలమట్టం చేసింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ (MLA, MLC).. 12 ఎక రాలు రాజేంద్రనగర్ బుమ్రు ఖ్దౌలా చెరువులో ఆక్రమణలది పెద్ద కథే. ఇక్కడ ఎఫ్టీఎల్లో ఏకంగా 12 ఎకరాలలో జి ప్లస్ 2 నిర్మాణాలు చేపట్టారు. కూల్చివేత ను అడ్డుకునేందుకు వచ్చిన ఎంఐ ఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. బుమ్రుఖ్దౌలా చెరువులో భవ నాలు నిర్మించడంలో ముబిన్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్బేగ్ పాత్ర ఉందని హైడ్రా (hydra)ప్రకటించింది.
గండిపేటపై గద్దల్లా వాలారు…
ఒకనాడు జంట నగరాల తాగునీటి వనరులు ఉస్మాన్సాగర్ (గండి పేట), హిమాయత్సాగర్. ఇప్పుడు వీటి చుట్టూ కోకొల్లలుగా ఆక్రమణ లు వెలిశాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో కొందరు రాజకీయ, వ్యాపా ర ప్రముఖులు ఇంద్రభవనాల్లాంటి అతిథి గృహాలు నిర్మించారు. వరద వచ్చే కాల్వల్లో అత్యధికం కను మరుగయ్యాయి. దీంతో మురు గంతా జంట జలాశయాల్లో చేరు తోంది. గండిపేట ఎఫ్టీఎల్లో ఖానాపూర్ గ్రామ పరిధిలో 8.75 ఎకరాలు, చిలుకూరులో 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవ నాలను ఈ నెల 18న హైడ్రా నేల మట్టం చేసింది. ఇక్కడ రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లం రాజు, కావేరి సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథనిలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సునీల్రెడ్డి, ప్రొ కబడ్డీ లీగ్ యజమాని అనుపమలకు చెం దిన భవనాలను ఉండడం గమ నార్హం.
హిమాయత్సాగర్ (Himayatsagar)ఎఫ్ టీఎ ల్, బఫర్ జోన్లోనూ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతరుల అతిథి గృహాలు ఉన్నాయన్న ప్రచారం జరు గుతోంది. దీని ఎఫ్టీఎల్ నోటిఫై చేయనందున నిర్మాణాలపై చర్యల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. అధికార పార్టీకి చెందినవారి నిర్మా ణాలు ఉన్నందునే ఎఫ్టీఎల్ నిర్ధా రణ కాలేదనే అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపణలు వస్తున్నా యి. ఈ నేపథ్యంలో గతంలో నిర్ధా రించిన ఎఫ్టీఎల్ను ప్రామాణికం చేసుకుని చర్యలు తీసుకునే విష యమై ప్రభుత్వం నుంచి హైడ్రా స్పష్టత కోరింది. సర్కారు నిర్ణయం అనంతరం చర్యలు ఉంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
ఆక్రమణదారులు, అధికారుపై చర్యలు: రంగనాథ్ చెరువులు, పార్కులు కబ్జాకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యల దిశగా హైడ్రా కసరత్తు చేస్తోంది. భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్) ప్రకారం ప్రభు త్వ ఆస్తులను ఆక్రమిస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చనే విషయాన్ని అధికారులు పరిశీలి స్తున్నారు. వీటి విచారణ కోసమే త్వరలో హైడ్రా పోలీస్స్టేషన్ రా నుంది. చందానగర్ ఈర్ల చెరువు, ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో భవన నిర్మాణాలకు అనుమతిచ్చిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, నిర్మాణదారులతో పాటు వారికి సహకరించినవారిపై ప్రత్యేక దృష్టిసారించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కొన్ని చెరువుల ఎఫ్టీఎల్ నోటిఫైకి ప్రభు త్వం ఆదేశించిందని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుందని స్ప ష్టం చేశారు. అక్రమాలకు సహ కరించిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు.