Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jajula Srinivas Goud: ఆగస్టు నెలాఖరుకు కులగణన

–లేకుంటే లక్ష మందితో రాజధానిని దిగ్బంధిస్తాం
–బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

Jajula Srinivas Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీలకు (bc) రాజ్యాధికార కోసం ప్రత్యేకంగా రాజ కీయ పార్టీ ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ (Jajula Srinivas Goud) తెలిపా రు. కరీంనగర్‌లో బుధవారం బీసీ సమగ్ర కుల గణన సాధన యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లా డుతూ కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఆరు నెల ల్లో బీసీ గణన చేసి రిజర్వేషన్‌ పెంచుతామని ఎన్నికల కు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ (Declaration of BC) చేసిందని, దాన్ని ఆ పార్టీకి గుర్తు చేయడానికే తాను కామారెడ్డి నుంచి యాత్ర ప్రారం భించానన్నారు.

బీసీ రిజర్వేషన్‌ (BC reservation)పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నిక లకు పోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించకుంటే గాంధీభ వన్‌ను ముట్టడిస్తామని హెచ్చరిం చారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీల (bc) వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 2న తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయా లు, కలెక్టరేట్ల ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని, ఆగస్టు చివరి వారంలోపు కులగ ణన చేయకుంటే లక్ష మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.