Johnny Master: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) తల్లి బీబీజాన్ (Bibijan)అస్వస్థతకు లోనయ్యారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జైళ్లో ఉన్న బెంగతో బీబీజాన్ అస్వ స్థతకు గురైనట్లు తెలిసింది. ఆమె కు గుండెపోటు రావటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో జానీమాస్టర్ తల్లి బీబీజాన్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచినట్లు తెలిసింది. జానీమాస్టర్ సతీమణి ఆయేషా (Johnny Master’s wife Ayesha) ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను చూస్తు న్నారు. అయితే జానీమాస్టర్ (Johnny Master) తల్లి బీబీజాన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కొడుకు జైళ్లో ఉన్నాడనే బాధ, బెంగతోనే బీబీజాన్ అస్వస్థ తకు గురైనట్లు సన్నిహితులు చెప్తున్నారు.మరోవైపు జానీమాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి.. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారంటూ పోలీసులను ఆశ్రయించటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించారని.. పలుసార్లు అఘాయిత్యం చేశారంటూ ఆ యువతి (young woman)పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జానీమాస్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు అత్యాచారం కేసు నమోదు కావ టంతో జానీమాస్టర్కు రావాల్సిన నేషనల్ అవార్డు కూడా నిలిచి పోయింది. 2022 ఏడాదికి గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్గా అప్పటికే జానీమాస్టర్కు అవార్డు ప్రకటిం చారు. అయితే ఈలోపే ఆయనపై ఆరోపణలు రావటంతో అవార్డును నిలిపివేశారు. ఇక అవార్డు తీసుకో వడం కోసం కోర్టు జానీమాస్టర్కు అప్పటికే మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. కానీ.. ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావటంతో.. నేషనల్ ఫిల్మ్ అవార్డు జానీ మాస్టర్కు (Johnny Master) అవార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి జానీ మాస్టర్ చంచల్గూడ జైలులో విచారణ ఖైదీగా కొనసాగుతు న్నారు. ఈ విషయాలన్నీ చూసి జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ (Johnny Master’s wife Ayesha) కలత చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ మీద సోమవారం విచారణ జరగనుంది.