Kaleshwaram project: కాళేశ్వరం పై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ
వివాదా స్పద కాళేశ్వరం ప్రాజెక్టులోని అవక తవకలపై విచారణ ఇక వేగంగా ముందుకు సాగునుంది.
ఈ నెల 16వ తేదీ వరకు హైదరా బాద్లోనే జస్టిస్ ఘోష్
రేపటి నుంచి వరుసగా ఆరు రోజు ల పాటు అధికారులతో సమావేశా లు
ప్రజా దీవెన హైదరాబాద్: వివాదా స్పద కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleshwaram project)అవక తవకలపై విచారణ ఇక వేగంగా ముందుకు సాగునుంది. కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై న్యా య విచారణ ప్రక్రియ సోమవారం నుంచి మరింత వేగంగా జరగనుం ది. ప్రాజెక్టు లో జరిగిన అవకతవ కలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ(Justice PC Ghosh Committee)విచారణ జరుపుతున్న సంగతి విధితమే. ఈ నెల 10వ తేదీ నుంచి వరుసగా ఆరు రోజుల పాటు బూ ర్గుల రామకృష్ణారావు(Boorgula Ramakrishna Rao)భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో అధి కారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్(Justice Pinaki Chandraghose) సమావేశం కానున్నారు.
శనివారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న మర మ్మతు పనులను పరిశీలించారు. వాటిపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశిం చారు. ఇక విచారణలో భాగంగా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై జస్టిస్ ఘోష్ నిర్ణయం తీసు కోనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజె క్టులో జరిగిన అవి నీతి, నిర్మాణ, నిర్వాహణ లోపాలపై కమిషన్కు 54 వరకు ఫిర్యాదులు సమర్పించారు.
ఫిర్యాదులతోపాటు జాతీయ డ్యామ్ సేఫ్టీ(National Dam Safety)అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజనీర్లు, ప్రజా ప్రతి నిధులకు నోటీసులు ఇవ్వను న్నా రు. తొలుత నోటీసులు జారీ చేసి, స్పందించని పక్షంలో సమన్లపై కమి షన్ నిర్ణయం తీసుకునే అవకాశా లున్నాయి. వాస్తవానికి కాళేశ్వ రంపై నివేదిక అందించడానికి ఈ నెల 30వ తేదీ వరకే ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో మరో మూడు నెల లు నివేదిక అందించడానికి గడువు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Justice PC Ghosh inquiry Kaleshwaram project