Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram Barrages: ప్రమాణాలు పట్టించుకోలేరు ఐఎస్‌ కోడ్‌ను పక్కనపెట్టారు

–గేట్ల నిర్వహణపై ఎలాంటి కమిటీ వేయలేదు
–పర్యవేక్షణ లేకపోవడం వల్లే మేడిగడ్డ కుంగిపోయింది
–జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌
పరీక్షలతోనే కారణాలేమిటో తెలు స్తాయి
–జస్టిస్‌ పీసీ ఘోష్‌కు నిపుణుల బృందం అఫిడవిట్‌

Kaleshwaram Barrages:ప్రజా దీవెన, హైదరాబాద్‌: కాళేశ్వరం బ్యారేజీల (Kaleshwaram Barrages) నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భార తీయ ప్రమాణాల సంస్థ ఇండియన్‌ స్టాండర్డ్‌ కోడ్‌–7349ను (Indian Standard Code) పాటించలే దని, నిర్వ హణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు. ఈ మేరకు జస్టిస్‌ పినాకి చంద్రఘో ష్‌కు ఆఫిడవిట్ల రూపంలో ఫిర్యాదు చేశారు. అఫిడవిట్ల లోని సారాంశం ఇలా ఉంది. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం ప్రారంభం కాగా… 2019 జూన్‌లో పనులు పూర్తయ్యాయి. 2019 తొలి వరదల అనంతరం మూడు బ్యారేజీ గేట్లను దించిన సమయం లో సీసీ బ్లాకులు చెల్లాచెద రయ్యాయి. ఐఎస్‌ కోడ్‌లోని క్లాజు 5.1 ప్రకారం, వరదల అనంతరం నవంబరులో గేట్లన్నీ ఎత్తి బ్యారేజీని ఖాళీ చేసి, బ్యారేజీ ఏమైనా దెబ్బతి న్నదా అని సమగ్ర పరిశీలన చేయా ల్సి ఉంది. కానీ, ఆ పని చేయలేదు. క్లాజు 5.3 ప్రకారం అప్‌స్ట్రీమ్‌ ఎగువ భాగంతో పాటు దిగువభా గంలోని అఫ్రాన్లు ఏ విధంగా ఉన్నా యో గుర్తించాల్సి ఉండగా ఆ పని కూడా జరగలేదు.

గేట్ల (gates)నిర్వహణకు సంబంధించి కూడా ఒక కమిటీ వేయాల్సి ఉండగా అదీ కార్యరూ పం దాల్చలేదు. అన్ని గేట్లు ఒకేసారి కాకుండా ఒక్కో గేటును ఎత్తడం వల్ల నీటి ఒత్తిడి పడి డౌన్‌స్ట్రీమ్‌లో సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడం, అఫ్రాన్‌ దెబ్బతినడం వంటి సమ స్యలు ఉత్పన్నమయ్యాయి. బ్యారే జీకి ఎగువతోపాటు దిగువ భాగం లో వరద సజావుగా ప్రవహించేలా ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ఆ వరద కూడా బ్యారేజీని దెబ్బతీ సింది. ఐఎస్‌ ప్రమాణాల (IS standards)ఆధారం గా పనులు జరుగకపోవడంతో క్రమంగా బ్యారేజీలు దెబ్బతింటూ. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారే జీ కుంగింది. బ్యారేజీల నిర్వహణ వైఫల్యంతో సీకెంట్‌ ఫైల్స్‌ దెబ్బ తిని ఇసుకంతా బ్యారేజీ పునాదుల నుంచి జారి అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడి మేడిగడ్డ కుంగి పోయింది. బ్యారేజీల వైఫల్యాలకు కారణాలన్నీ బయటపడాలంటే జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు జరగాలి. కాగా, బ్యారేజీ నిర్మాణంలో ఉండగానే దెబ్బ తిన్న దని, దీనికి నిర్మాణలోపంతో పాటు డిజైన్‌ లోపం కూడా ఒక కారణమ ని మరికొందరు నిపుణులు కమిషన్‌ కు గుర్తు చేశారు. 2019 నవంబరు లోనే సీసీ బ్లాకులు దెబ్బతిన్న తర్వా త నిర్మాణ సంస్థ అప్పటి అధికారు లకు లేఖ రాసి సరైన డిజైన్‌ ఇస్తే, మరమ్మతులు చేస్తామని చెప్పినా కూడా.. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ఎలాంటి డిజైన్‌ ఇవ్వలే దని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రా జెక్టు విచారణలో భాగంగా శుక్ర వారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ హైదరా బాద్‌కు చేరుకున్నారు. నీటిపారుదల శాఖ (Irrigation Department)అధికారులతో సమావేశ మయ్యారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న ఆయన కమిషన్‌కు చేరిన అఫిడవిట్లను పరిశీలించి, ఎవరె వరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసు కోనున్నట్లు సమాచారం.